మృత్యువు

సోమ, 12/06/2021 - 16:39

మృత్యువు ప్రతీ ఒక్కరికి తప్పకుండా సంభవిస్తుంది. అది కేవలం మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది ప్రపంచంలో ఉన్న జీవరాసులందరికి సంబంధించినది. మృత్యువు గురించి సంక్షిప్త వివరణ...

మృత్యువు

ఇస్లాం దృష్టిలో మృత్యువు, ఈలోకం యొక్క చివరి స్థానం మరియు పరలోకం యొక్క మొదటి స్థానం. మరణించిన తరువాత కొన్ని స్థానాలు ఉంటాయి అవి ఈ క్రమంలో ఉంటాయి: మృత్యువు, సమాధి మరియు బర్జఖ్, ఖియామత్, శంఖం ఊదడం, లెక్క తీసుకోవడం, సిరాత్, స్వర్గ-నరకం-అఅరాఫ్. ఈ స్థానాలు అందరికీ వర్తిస్తాయి. మనిషి ఈలోకంలో చేసిన చర్యలను బట్టి పరలోకం స్థితి నిర్ణయించబడుతుంది. ఇవన్నీ కేవలం ఖుర్ఆన్ మరియు రివాయతుల ఆధారంగానే నిదర్శించబడతాయి. ఇక్కడ మృత్యువు గురించి తెలుసుకుందా:

మృత్యువు
మృత్యువు ప్రతీ ఒక్కరికి తప్పకుండా సంభవిస్తుంది. అది కేవలం మనుషులకు మాత్రమే సంబంధించింది కాదు, ఇది ప్రపంచంలో ఉన్న జీవరాసులందరికి సంబంధించినది. ఖుర్ఆన్ ఈ యదార్థం గురించి వివిధ రకాలుగా వివరించెను: “మీరెక్కడ ఉన్నాసరే, మృత్యువు మిమ్మల్ని కబళిస్తుంది. ఆఖరికి మీరు పటిష్టమైన కోటలలో ఉన్నాసరే(అది మిమ్మల్ని వదలదు)”.[సూరయె నిసా, ఆయత్:78]
మరో చోట ఇలా ఉపదేశించబడి ఉంది: “(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా మేము ఏ మానవుణ్ణీ శాశ్వతంగా జీవించి ఉండేట్లుగా చేయలేదు. ఒకవేళ నువ్వు చనిపోతే, వాళ్లు మాత్రం శాశ్వతంగా బ్రతికి ఉంటారా ఏమిటీ?”[సూరయె అంబియా, ఆయత్:34]
భూమండలంపై ఉన్నవారందికి మరణం సంభివిస్తుంది అని కూడా సూచించబడి ఉంది: “భూమండలంపై ఉన్నవారంతా నశించి పోవలసినవారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే”[సూరయె రహ్మాన్, ఆయత్:26,27]

కొన్ని ఆయతులలో మృత్యువు ప్రాణులందరికీ మృత్యువు చెందుతాయి అని సూచిస్తుంది: “ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే”[సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్:185]
అందుకని ఇస్లాం దృష్టిలో ఏ మనిషీ శాశ్వతంగా ఈ లోకంలో ఉండిపోడు. “అల్లాహ్‌యే ఆత్మలను వాటి మరణ సమయంలో స్వాధీనం చేసుకుంటాడు. మరణం రాని వారి ఆత్మలను కూడా వాటి నిద్రావస్థలో ఆయన వశపరచుకుంటున్నాడు. మరి మరణ ఉత్తర్వు ఖరారైన వారి ఆత్మలను ఆపుకుంటున్నాడు. ఇతర ఆత్మలను ఒక నిర్ణీత గడువు వరకు వదలిపెడుతున్నాడు. చింతన చేసే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి”.[సూరయె జుమర్, ఆయత్:42]
అల్లాహ్ మరో చోట ఇలా ఉపదేశించెను: వారు ఆత్మను గురించి నిన్ను ప్రశ్నిస్తున్నారు. “ఆత్మ నా ప్రభువు ఆజ్ఞతో (ముడిపడి) ఉంది. మీరు ఒసగబడిన జ్ఞానం బహుస్వల్పం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.[సూరయె ఇస్రా, ఆయత్:85]
“ఓ ప్రశాంత మనసా! నీ ప్రభువు వైపు పద! నువ్వు ఆయన పట్ల సంతోషించావు. ఆయన నీ పట్ల సంతోషించాడు. కాబట్టి (సత్కరించబడిన) నా దాసులతో చేరిపో. నా స్వర్గంలో చేరిపో”[ముతప్ఫిఫీన్, ఆయత్:27-30]
మరణం సమీపంలో ఉన్న ఒక వ్యక్తి అతడు లేదా ఆమె చనిపోతాడని తెలిసిపోతుంది. పాపాత్ముల ఆత్మ పోవడం తీవ్రమైన నొప్పితో కూడి ఉంటుంది. మరణ క్షణం గురించి ఖుర్ఆన్ లో ఇలా ఉంది: “అసంభవం. (గుండెలోని) ప్రాణం గొంతు ప్రక్కన గల ఎముక వరకూ చేరుకున్నప్పుడు, ‘మంత్రించి నయం చేసే వాడెవడైనా ఉన్నాడా?’ అని అనబడినప్పుడు, ‘పోయేకాలం వచ్చింద’న్న సంగతిని అతను తెలుసుకున్నప్పుడు, ఒక పిక్క మరో పిక్కతో ఒడుసుకున్నప్పుడు, (ఓ మానవాత్మా!) ఈ రోజు నీవు నీ ప్రభువు వైపు సాగిపోవలసి ఉంటుంది”.[సూరయె ఖియామత్, ఆయత్:26-30]

మరో చోట ఇలా ఉపదేశించబడి ఉంది: “తీసుకోవలసిన ఇద్దరు(దూతలు) తీసుకోవటానికి వెళ్ళినప్పుడు (వారిలో) ఒకతను కుడి ప్రక్కన, మరోకతను ఎడమ ప్రక్కన కూర్చొని ఉంటారు. (మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు. చివరికి మరణ మైకం –సత్య సమేతంగా- రానేవచ్చింది. ‘(ఓ మనిషీ!) దేనిపట్ల నువ్వు బెదిరి పారిపోయేవాడివో అదే ఇది’ మరి శంఖం ఊదబడుతుంది. (శిక్ష గురించి) వాగ్దానం చేయబడిన రోజు ఇదే. ప్రతి వ్యక్తీ తన వెంట తనను తీసుకొచ్చేవాడొకడు, సాక్ష్యమిచ్చేవాడొకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు. (అతనితో ఇలా అనబడుతుంది:) “నిశ్చయంగా నువ్వు దీని పట్ల అలసత్వం వహించావు. ఇక నీ నుండి నీ తెరను తొలగించాము. ఈనాడు నీ చూపు చాలా సునిశితంగా ఉంది”.[సూరయె ఖాఫ్, ఆయత్:17-22]

రిఫరెన్స్
ఇస్లాం షినాసీ, అబ్దుల్ హుసైన్ ఖుస్రవీ పనాహ్, పేజీ409-411.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17