దైవప్రవక్త(స.అ) సున్నత్ మరియు ఇస్లామీయ చరిత్ర పరిశోధకుడు “షియాల పన్నెండు ఇమాములను దైవప్రవక్త(స.అ) నియమించారు మరియు తన తరువాత వారి ఇమామత్ మరియు ఖియాఫత్ పై నస్స్(స్పష్టంగా చెప్పడం)ను వెల్లడిం చారు” అన్న విషయం నిశ్చితముగా తెలుసు.
దైవప్రవక్త(స.అ) సున్నత్ మరియు ఇస్లామీయ చరిత్ర పరిశోధకుడు “షియాల పన్నెండు ఇమాములను దైవప్రవక్త(స.అ) నియమించారు మరియు తన తరువాత వారి ఇమామత్ మరియు ఖియాఫత్
పై నస్స్(స్పష్టంగా చెప్పడం)ను వెల్లడిం చారు” అన్న విషయం నిశ్చితముగా తెలుసు.
అహ్లెసున్నత్ యొక్క “సహ్హాయే సిత్తహ్”[1] లో కూడా వారి సంఖ్య పన్నెండే, అని ప్రవచించబడి ఉంది. మరియు వారు ఖురైషీయులు అయి ఉంటారు.
అహ్లెసున్నత్ యొక్క కొన్ని విశ్వసనీయ పుస్తకాలలో కూడా లిఖించబడి ఉంది. దైవప్రవక్త(స.అ) స్పష్టంగా ఆ ఇమాముల పేర్లను కూడా ఇలా వెల్లడిం చారు; వారిలో ముందుగా అలీ(అ.స) ఆ తరువాత అతని కుమారుడు హసన్(అ.స) ఆ తరువాత అతని(హసన్(అ.స)) సొదరుడు హుసైన్(అ.స) మరియు ఆ తరువాత హుసైన్(అ.స) సంతానం ఒకరి తరువాత ఒకరు తొమ్మిది ఇమాములు మరియు చివరిలో మహ్దీ(అ.స) అని.
“యనాబీవుల్ మవద్దహ్” యొక్క రచయిత ఇలా లిఖించారు: “الاعتل” అను పేరు గల యూదుడు దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ఓ ముహమ్మద్! నేను మీతో చాలా కాలం నుండి నా మనసులో తుపాను రేపుతున్నటువంటి కొన్ని విషయాల గురించి ప్రశ్నించాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు నాకు జవాబు ఇచ్చినట్లైతే నేను ఇస్లాంను స్వీకరిస్తాను. దైవప్రవక్త(స.అ), ఓ అబూ ఇమారహ్! ప్రశ్నించు, అని అన్నారు. అతడు కొన్నీంటి గురించి అడిగిన తరువాత ఇలా అన్నాడు మీరు అన్నింటికి పూర్తిగా సరైన జవాబు ఇచ్చారు, ఇక మీరు దీనికి జవాబు ఇవ్వాడి; మీ ఉత్తరాధికారి(వసీ) ఎవరూ? ఎందుకంటే ప్రతీ ప్రవక్తకు ఎవరో ఒకరు “వసీ” అయి ఉంటాడు ఉదాహారణకు మా ప్రవక్త(మూసా(అ.స)) యొక్క వసీ, “యూషె ఇబ్నె నూన్”.
అప్పడు దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: “నా ఉత్తరాధికారి అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స), అతని తరువాత నా కుమారులు హసన్(అ.స) మరియు హుసైన్ (అ.స), ఆ తరువాత హుసైన్(అ.స) సంతానం నుండి తొమ్మిది మంది ఇమాములు”
యూదుడు ఇలా అన్నాడు: వాళ్ళ పేర్లు కూడా నాకు వివరించండి.
దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: హుసైన్(అ.స) మరణాంతరం (షహాదత్) అతని కుమారుడు అలీ(అ.స), అలీ(అ.స) మరణాంతరం అతని కుమారుడు ముహమ్మద్ (అ.స), ముహమ్మద్(అ.స) మరణాంతరం అతని కుమారుడు జాఫర్(అ.స), జాఫర్(అ.స) మరణాంతరం అతని కుమారుడు ముసా(అ.స), మూసా(అ.స) మరణాంతరం అతని కుమారుడు అలీ(అ.స), అలీ(అ.స) మరణాంతరం అతని కుమారుడు హసన్ (అ.స), హసన్(అ.స) మరణాంతరం అతని కుమారుడు మహ్దీ(అ.స) అవుతారు. ఈ పేర్లు విన్న తరువాత ఆ యూదుడు ముస్లిముగా మారాడు మరియు రుజుమార్గం పొంది అల్లాహ్ను స్తుతించాడు.[2]
ఒకవేళ దీని గురించి షియా పుస్తకాల పేజీలు త్రిపి చూసినట్లైతే, మరియు ఈ టాపిక్ పై ముఖ్యమైన యదార్ధాలను ఒకచోట చేర్చినట్లైతే, ఎన్నో పుస్తకాలు తయారు అవుతాయి.
కాని సాక్ష్యంగా మా కొరకు ఇంత చాలు. అహ్లెసున్నత్ వల్ జమాఅత్ ఉలమాలు పన్నెండు ఇమాములను సమ్మతిస్తారు మరియు వారు అలీ(అ.స) మరియు అతని పవిత్ర సంతానమే.
మరియు ఏదైతే మా ఈ నమ్మకాన్ని ఇంకా బలపరుస్తుందో అది అహ్లెబైత్ (అ.స) నుండి పన్నెండు ఇమాములలో ఏ ఒక్కరు కూడా (మానవుల నుండి) ఎవ్వరి ముందు జ్ఞానం కోసం కూర్చోలేదు. మరియు చరిత్రకారులు, ముహద్దిసీన్[3] లు మరియు బయోగ్రాఫర్లు వారి గురించి ఇలా వ్రాయలేదు; “అహ్లెబైత్(అ.స)ల ఇమాములు ఫలానా సహాబీ లేదా తాబెయీ[4] ల నుండి ఎవరో ఒకరి వద్ద చదువు నేర్చుకున్నారు అని”. వాస్తవానికి ఉమ్మత్ యొక్క వేరే ఇమాములు మరియు పండితులు ఇలా చేశారు.
ఉదా: “అబూ హనీఫా”, “ఇమామ్ జాఫర్ సాదిఖ్(అ.స)” నుండి విద్య మరియు జ్ఞానం పొందారు. మరియు “మాలిక్”, “అబూ హనీఫా” నుండి విద్య నేర్చుకున్నారు. మరియు “షాఫెయీ”, “మాలిక్” నుండి జ్ఞానాన్ని పొందారు. మరియు “మాలిక్” నుండి “అహ్మద్” విద్య నేర్చుకున్నారు.
కాని అహ్లెబైత్(అ.స) ఇమాముల జ్ఞానం, దైవజ్ఞానం. అది వారికి వారి శ్రేష్ఠమైన తండ్రీ మరియు పితామహుల నుండి వారసత్వంగా లభించింది.
రిఫరెన్స్
1. ఆరు సరైన గ్రంథాలు.
2. యనాబీవుల్ మువద్దహ్, పేజీ440. ఫరాయిదుల్ సంతైనె హుమవైనీ.
3. ఐతిహాసికుడు, కథకుడు, వ్యాఖ్యాత, ఆవిష్కరించేవాడు, ధర్మ శాస్త్రం తెలిసిన వాడు.
4. దైవప్రవక్త(స.అ) దర్శనం కాకుండా కేవలం సహాబీయులనే దర్శించించుకున్న వారు.
అల్ షియా హమ్ అహ్లుస్సున్నహ్, తీజానీ సమావీ.
వ్యాఖ్యానించండి