అజ్ఞానపు కాలంలో ఇతని పేరు “అమ్ర్”, దైవప్రవక్త(స.అ) ఇతనిని “అబ్దుల్ రహ్మాన్” అని నామకరణం చేశారు. ఇతను “బనీజొహ్రహ్” తో సంబంధంగల వారు. “సఅద్” యొక్క పినతండ్రి కుమారుడు...
అజ్ఞానపు కాలంలో ఇతని పేరు “అమ్ర్”, దైవప్రవక్త(స.అ) ఇతనిని “అబ్దుల్ రహ్మాన్” అని నామకరణం చేశారు. ఇతను “బనీజొహ్రహ్”
తో సంబంధంగల వారు. “సఅద్” యొక్క పినతండ్రి కుమారుడు.
ఇతను కూడా పెద్ద సహాబీయులలో మరియు ముహాజిరీన్
లలో ఒకరు. ప్రతీచోట దైవప్రవక్త(స.అ)తో పాటు ఉండేవారు. ఉమర్ ఖలీఫా ఎన్నిక కొరకు ఏర్పర్చిన ఆరుగురి కమిటీలో ఒక కార్యకర్త. కార్యకర్తే కాదు ఆ కమిటీకి అధ్యక్షుడు కూడాను. మిగిలిన వారందరి పై ప్రాధాన్యత గలవారు ఎందుకంటే ఉమర్ “మీ మధ్య ఖిలాఫత్ క్రమంలో వైరుధ్యం గనక ఏర్పడితే ‘అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్’ ఎటు ఉంటే దానినే సరైనదిగా భావించండి” అని చెప్పారు.
అహ్లెసున్నత్ వల్ జమాఅత్
ల అభిప్రాయానుసారం స్వర్గశుభవార్త ఇవ్వబడ్డ ఆ పదిమందిలో ఒకరు ఇతను.
“అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్”, ఖురైషీయులకు చెందిన పెద్ద వ్యాపరవేత్తలలో ఒకరు, అని కూడా ప్రసిద్ధి చెందిన విషయం. చరిత్ర కారుల ఉల్లేఖన ప్రకారం ఇతను కుడా చాలా ఆస్తిని విడిచి వెళ్ళారు. లక్ష ఒంటెలు, వంద గుర్రాలు, పదివేల గొర్రెలు మరియు మేకలు, మరి చాలా వ్యాయసాయపు భూములు. అతను విడిచిన ఆస్తిని అతని నాలుగు భార్యలలో పంచగా ఒక్కొక్కరికి 84 వేలు దక్కాయి.[1]
“అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్”, “ఉస్మాన్ ఇబ్నె అఫ్ఫాన్”కు బావ అవుతారు. ఎందుకంటే అతను “ఉమ్మెకుల్సూమ్ బింతె ఉఖ్బహ్ ఇబ్నె అబీ ముయీత్”
తో పెళ్ళి చేసుకున్నారు. ఈమె ఉస్మాన్ యొక్క తల్లి తరపు నుండి చెల్లి అవుతారు.
చరిత్ర పుస్తకాలు చదవడం ద్వార ఇతను హజ్రత్ అలీ(అ.స)ను ఖిలాఫత్ నుండి వేరు చేయడానికై షైకైన్(అబూబక్ర్ మరియు ఉమర్)ల సీరత్
ను షరత్తుగా పెట్టి చాలా పెద్ద పాత్రను పోషించారని మనకు తెలుస్తుంది. “అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్”
కు తెలుసు అలీ(అ.స) ఈ షరత్తును ఎప్పటికీ అంగీకరించరని, ఎందుకంటే షైకైన్
ల సున్నత్ మరియు సీరత్ అల్లాహ్ గ్రంథానికి మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
కు వ్యతిరేకంగా ఉండేది.
“అబ్దుల్ రహ్మాన్” యొక్క అజ్ఞానపు పక్షపాతం మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్ నుండి దూరాన్ని మరియు పవిత్ర ఇత్రత్(అ.స) పట్ల వ్యతిరేకత కుట్రలో భాగస్వాములు మరియు ఖిలాఫత్
ను ఖురైషీయులలో నిర్ధారించినవారు, అని చెప్పడానికి మాకు ఇది చాలు.
“బుఖారీ” తన పుస్తకం “సహీ”లో “కితాబుల్ అహ్కామ్”లో “కైఫ యుబాయివున్నాస్” అధ్యాయంలో ఈ రివాయత్
ను ఇలా ఉల్లేఖించారు; “మసూర్” ఇలా అన్నారు: రాత్రి కొంచెం గడిచిన తరువాత “అబ్దుల్ రహ్మాన్” నా వద్దకు వచ్చారు, నిద్ర నుండి లేచేంత వరకు అతను తలుపు తట్టారు. ఇలా అన్నారు: పడుకుంటున్నట్లున్నావ్! అల్లాహ్ సాక్షిగా ఈ రాత్రి నాకు నిద్రపట్టడం లేదు. వెళ్ళు, వెళ్ళి జుబైర్ మరియు సఅద్
ను తీసుకొని రా. వారితో మాట్లాడాలి. నేను వాళ్ళిద్దరినికి పిలుచుకొచ్చాను. అతను వాళ్ళిద్దరితో మాట్లాడారు.
ఆ తరువాత అలీ(అ.స)ను కూడా పిలూ, అని అన్నారు. అతనిని కూడా పిలుచుకొచ్చాను, అతనితో కూడా మాట్లాడారు, చివరికి అర్ధరాత్రి అయ్యింది. ఆ తరువాత అలీ(అ.స) అతని వద్ద నుండి లేచినిలబడ్డారు. అతను ఖిలాఫత్ అపేక్షతో ఉన్నారు. అబ్దుల్ రహ్మాన్ ఎందుకో అలీ(అ.స)తో భయపడుతున్నారు. ఆ తరువాత ఉస్మాన్
ను పిలూ, అని అన్నారు. అతనిని కూడా పిలిపించాను అతనితో కూడా చాలా సేపు మాట్లాడారు చివరికి ముఅజ్జిన్ యొక్క అజాన్
ను విని వాళ్ళిద్దరు దూరమయ్యారు.
జనం “ఫజ్ర్” నమాజ్ చదివినప్పుడు, ఆ గుంపులు పీఠం వద్దకు వచ్చి చేరాయి. అప్పుడు అక్కడున్న మహాజిరీన్ మరియు అన్సారుల నుండి తమ తమ వంశీకుల వద్దకు పంపారు, మరియు సైన్యాధిపతుల వద్దకు మనుషులను పంపడం జరిగింది. అతను ఉమర్
తో చేసిన వాగ్దానికి నిర్వర్థిస్తున్నారు.
అందరు అక్కడికి చేరిన తరువాత “అబ్దుల్ రహ్మాన్” కలెమా చదివి ఇలా అన్నారు. “ఇక తరువాత విషయానికి వస్తే, అలీ(అ.స)! నేను జనం విషయంలో బాగా ఆలోచించాను, మరియు దాని గురించి ఇతరులతో మాట్లాడాను, కాని వారు ఉస్మాన్
కు సమానంగా ఎవ్వరిని భావించడం లేదు. వారు ఉస్మాన్
ను చాలా ఇష్టపడుతున్నారు కనుక మీరు మీకు వ్యతిరేకంగా మార్గాన్ని తయారు చేసుకోకండి” ఆ తరువాత ఉస్మాన్
ను ఉద్దేశించి ఇలా అన్నారు: “నేను అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) సున్నత్
తో పాటు షైకైన్
ల సీరత్ పై నీతో బైఅత్ చేస్తున్నాను” ఇక అబ్దుల్ రహ్మాన్ బైఅత్ చేస్తే ఇక ముహాజిరీన్
లు అన్సారులు, సైన్యాధిపతులు మరియు మిగిలిన ముస్లిములు ఉస్మాన్
తో బైఅత్ చేశారు.[2]
రిఫరెన్స్
1. తబరీ, మురవ్విజుజ్జహబ్ ఇబ్నె సఅద్ మరియు తాహా హుసైన్ మొ॥
2. సహీబుఖారీ, భాగం8, పేజీ123.
వ్యాఖ్యానించండి