గదీర్ సంఘటన అహ్లె సున్నత్ గ్రంథాలలో

మంగళ, 07/12/2022 - 19:06

గదీర్ సంఘటన ప్రస్తావన అహ్లెసున్నతులలో ఉందా? అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

గదీర్ సంఘటన అహ్లె సున్నత్ గ్రంథాలలో

ప్రశ్నేమిటంటే గదీర్ సంఘటన ప్రస్తావన అహ్లెసున్నతులలో ఉందా? మా పై పక్షపాతం నింద పడకూడదు అందుకని జాగ్రత్తగా ఉండడం మరియు ఈ టాపిక్ పై వివేకంగా చర్చించడం చాలా అవసరం. ఇరువైపుల సాక్ష్యాలను చూడాలి మరియు కేవలం అల్లాహ్ అనుగ్రహం దృష్టిలో ఉండాలి. ఎందుకంటే ప్రజలు మాకు “షియా ముస్లింల వచనములే ఇష్టం” అని అనకూడదు. ఏది సరైనదో అదే చెప్పాలి ఎందుకంటే అల్లాహ్ మునాఫిఖీన్‌ల కపటం నుండి జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాడు. ఆయత్:
وَمِنَ ٱلنَّاسِ مَن يُعۡجِبُكَ قَوۡلُهُۥ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَيُشۡهِدُ ٱللَّهَ عَلَىٰ مَا فِي قَلۡبِهِۦ وَهُوَ أَلَدُّ ٱلۡخِصَامِ

అనువాదం: మానవుల్లోని కొందరు (ఇలాంటి మునాఫిఖులు కూడా ఉంటారు) వాళ్ళు చెప్పే మాటలు ఇహలోక జీవితంలో నిన్ను ఎంతో రంజింపచేస్తాయి. తన సంకల్పశుద్ధిని గురించి తెలుపటానికి అతడు అల్లాహ్‌ను మాటిమాటికి సాక్షిగా నిలబెడతాడు[బఖరహ్ సూరా:2, ఆయత్:204.]

ఈ ప్రశ్నలకు జవాబు “అవును” అనే అనాలి ఎందుకంటే అహ్లెసున్నతుల చాలా ఉలమాలు ఈ సంఘటనను కాలాల పరంగా కూడా లిఖించారు. అహ్లెసున్నతుల పుస్తకాల నుండి కొన్ని సాక్ష్యాలు తిలకించండి:

1. “అహ్మద్ ఇబ్నె హంబల్”, “జైద్ ఇబ్ అర్ఖమ్” ద్వార ఇలా రివాయత్‌ను ఉల్లేఖించారు: “మేము దైవప్రవక్త(స.అ)తో పాటు ఒక లోయలో దిగాము దానిని “గదీరె ఖుమ్” అంటారు. దైవప్రవక్త‎(స.అ) నమాజ్ చదవమని ఆదేశించారు మరియు ఆ మండుటెండలో నమాజ్ చదివాము ఆ తరువాత దైవప్రవక్త‎(స.అ) ఉపన్యాసమిచ్చారు. “సుమ్రహ్” అను ఒక చెట్టుపై వస్త్రాన్ని వేసి దైవప్రవక్త‎(స.అ)ను సూర్యకాంతి నుండి అడ్డుకున్నారు. ఆ తరువాత ఇలా అన్నారు: “మీకు తెలియదా” లేదా “నేను మీ పై మీ కన్న ఎక్కువ అధికారం ఉన్న వాడిని అని సాక్ష్యామివ్వరా?” అని ప్రశ్నించారు. అందరు కలిసి కట్టుగా “అవును” అని అన్నారు. అప్పుడు దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: నేను ఎవరికి మౌలా(స్వామి)నో అలీ(అ.స) కూడా వాళ్ళ స్వామియే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ని ఇష్టపడిన వారిని నీవు కూడా ఇష్టపడు మరియు అలీ‎(అ.స)ని ద్వేషించే వారిని అప్రతిష్టతకు గురిచేయ్యి”[1].

2. “ఇమామ్ నిసాయి”, తన పుస్తకం “అల్ ఖసాయిస్”లో “జైద్ బిన్ అర్ఖమ్” ద్వార రివాయత్‌ను ఉల్లేఖించారు: అతను ఇలా అన్నారు: “దైవప్రవక్త‎(స.అ), హజ్జతుల్ విదా నుండి తిరిగి వస్తుండగా “గదీరె ఖుమ్‌”లో దిగినప్పుడు కర్రలతో పీఠాన్ని తయారు చేయమని ఆదేశించారు. ఆ పని పూర్తయిన తరువాత ఇలా అన్నారు: బహుశ ఈ సారి అల్లాహ్ తరపు నుండి పిలుపు రావచ్చు మరి నేను దానిని అంగీకరించ వచ్చు (అందుకని) మీ మధ్య అత్యంత విలువైన రెండు వస్తువులను విడిచి వెళ్తున్నాను అందులో ఒకటి, మరోదానితో పెద్దది, అల్లాహ్ గ్రంథం మరియు నా ఇత్రత్(వాళ్ళే) నా అహ్లెబైత్(అ.స)లు (కూడాను). నా తరువాత ఈ రెండింటితో మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాను. (ఈ విషయాన్ని నా నుండి వినుకోండి) ఈ రెండు నా వద్ద (కౌసర్) సేలయేరుకు చేరనంత వరకు వాటిలో ఎటువంటి విభేదం మరియు దూరం ఎర్పడదు. ఆ తరువాత ఇలా అన్నారు: అల్లాహ్ నాకు మౌలా(స్వామి), నేను ప్రతీ విశ్వాసుని స్వామిని, ఆ తరువాత అలీ(అ.స) చేయ్యిని పట్టి ఇలా ప్రకటించారు: నేను ఎవ్వరి వలీ(స్వామి)నో అలీ(అ.స) అతని వలీయే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ని ఇష్టపడిన వారిని నీవు కూడా ఇష్టపడు మరియు అలీ(అ.స)ని ద్వేషించే వారిని ఇష్టపడకు. “అబుల్ తుఫైల్‎”‎ ఇలా ప్రశ్నించాడు: ఓ జైద్ నీవు విన్నావా? జైద్ ఇలా అన్నారు: అవును(నేనే కాదు) ఆ మైదానంలో ఉన్న వారందరూ తమ తమ కళ్ళతో చూశారు మరియు తమ తమ చెవులతో విన్నారు”.[2]

3. “హాకిమె నైషాపూరీ”, “జైద్ బిన్ అర్ఖమ్” ద్వార రెండు సరైన రావీయుల క్రమంతో షైకైన్(బుఖారీ, ముస్లిం)ల షరతుతో ఇలా ఉల్లేఖించారు: అతను ఇలా అన్నారు: “దైవప్రవక్త(స.అ), హజ్జతుల్ విదా నుండి తిరిగి వస్తుండగా “గదీరె ఖుమ్”లో దిగినప్పుడు కర్రలతో పీఠం తయారు చేసేందుకు ఆదేశించారు ఆ పని పూర్తయ్యాక ఇలా అన్నారు: అల్లాహ్ నన్ను తన వద్దకు ఆహ్వానించ వచ్చు మరి నేను ఆ ఆహ్వానాన్ని అంగీకరించ గలను. నేను మీ మధ్య రెండు ప్రతిష్టాత్మకమైన వస్తువులను విడిచి వెళ్తున్నాను వాటిలో ఒకటి, మరోకటికి మించినవి, మరి అవి అల్లాహ్ గ్రంథం మరియు నా అహ్లెబైత్(అ.స)లు, నా తరువాత ఈ రెండింటితో మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాను? ఆ రెండింటి మధ్య నా వద్దకు కౌసర్ సేలయేరుకు చేరనంత వరకు ఎన్నటికి విభేదం రాదు. ఆ తరువాత ఇలా అన్నారు: అల్లాహ్ నాకు మౌలా(స్వామి), నేను ప్రతీ విశ్వాసుని స్వామిని, ఆ తరువాత హజ్రత్ అలీ(అ.స) చేయ్యిని పట్టి ఇలా ప్రకటించారు: నేను ఎవ్వరి వలీ(స్వామి)నో అలీ(అ.స) అతనికీ వలీయే, ఓ అల్లాహ్! అలీ(అ.స)ని ఇష్టపడిన వారిని నీవు కూడా ఇష్టపడు మరియు అలీ(అ.స)ని ద్వేషించే వారిని ఇష్టపడకు”.[3]

4. ఈ హదీసును “ముస్లిం” కూడా తన పుస్తకం “సహీ ముస్లిం”లో “జైద్ బిన్ అర్ఖమ్” కథనాన్ని ఉల్లేఖించారు కాని చాలా సంక్షిప్తంగా; జైద్ ఇలా అన్నారు: “దైవప్రవక్త(అ.స), మక్కా మరియు మదీనా మధ్యలో ఒక “ఖుమ్” అను చెలమ వద్ద ఒక ఉపన్యాసమిస్తూ ఇలా అన్నారు: అల్లాహ్ స్తోత్రము తరువాత ఇలా అన్నారు: ప్రజలారా! నేను కూడా ఒక మనిషినే, తొందరలోనే నా ప్రభువు నుండి జిబ్రయీల్ వార్తను తీసుకొని రావచ్చు మరి నేను దానిని అంగీకరించనూ వచ్చు(అందుకని) నేను మీ మధ్య రెండు చాలా ప్రతిష్టాత్మకమైన వస్తువులను వదిలి వెళ్తున్నాను. ఆ రెండింటిలో ఒకటి అల్లాహ్ గ్రంథం అందులో హిదాయత్ మరియు వెలుగు ఉన్నాయి అందుకని అల్లాహ్ గ్రంథాన్ని తీసుకోండి మరియు దానిని వదలకండి. ఆ తరువాత అల్లాహ్ గ్రంథం పట్ల ప్రజలలో ఆసక్తిని పెంచారు. ఆ తరువాత ఇలా అన్నారు: (రెండవది) నా అహ్లెబైత్(అ.స)లు నేను నా అహ్లెబైత్(అ.స)ల విషయంలో మీకు అల్లాహ్ ప్రమాణాన్ని గుర్తుచేస్తున్నాను. ఈ వాఖ్యాన్ని మూడు సార్లు అన్నారు...,”[4]

రిఫరెన్స్
1. ముస్నదె అహ్మదె హంబల్, భాగం4, పేజీ372.
2. కితాబుల్ ఖసాయిస్, నిసాయి, పేజీ21.
3. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ109.
4. సహీ ముస్లిం, భాగం7, పేజీ122, బాబొ ఫజాయిలి అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స), ఈ హదీసును ఇమామ్ అహ్మద్, తిర్మిజీ, ఇబ్నె అసాకిర్ మొ॥. వారు కూడా ప్రస్తావించారు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18