అర్బయీన్ పాదయాత్ర యొక్క ప్రాముఖ్యత మరియు హుసైన్ మిస్బాహుల్ హుదా అన్న విషయాల పై సంక్షిప్త వివరణ...
ఇంతకు ముందు ఇమామ్ హుసైన్(అ.స) కు సంబంధించిన ఏదైనా విషయం ప్రపంచానికి చెప్పాలనుకుంటే అతను దైవప్రవక్త(అ.స) యొక్క మనవడు అని ముందుగా పరిచయించి ఆ తరువాత వారి గురించి చెప్పాల్సివచ్చేది కాని అల్ హందు లిల్లాహ్ ఈ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచానికి ఇమామ్ హుసైన్(అ.స) ఎవరో తెలిసొచ్చింది అందుకు చాలా కారణాలున్నాయి; వాటి నుండి ముఖ్య కారణం ఇమామ్ హుసైన్(అ.స) గారి అర్బయీన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వారిని ఇష్టపడే వారు నజఫ్ నుండి కర్బలా వరకు పాదయాత్ర చేయడం. మరి ఆ పాదయాత్ర చేసే వారికి ప్రసాదించబడే పుణ్యం గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా వివరిస్తున్నారు: “కాలినడకతో ఇమామ్ హుసైన్(అ.స) జియారత్ దర్శనానికి వెళ్ళేవారి ప్రతీ అడుగు పై వారి కోసం అల్లాహ్ ఒక పుణ్యం వ్రాసి, ఒక పాపాన్ని తుడిచేస్తాడు, అతడి స్థానాన్ని పెంచుతాడు. జియారత్ చేయడానికి వెళ్ళినప్పుడు అల్లాహ్ రెండు దూతలను అతడి కోసం, అతడి నోరు నుండి వచ్చే చెడును కాకుండా కేవలం మంచినే వ్రాయడానికి నియమిస్తాడు. మరి తిరిగి వచ్చే సమయంలో అతడిని సాగనంపుతూ ఇలా అంటారు: “ఓ అల్లాహ్ యొక్క వలీ! నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు ఇప్పుడు అల్లాహ్ సైన్యానికి చెందినవాడవు, ఆయన ప్రవక్త(అ.స) సైన్యానికి చెందినవాడవు, అతని అహ్లెబైత్(అ.స) సైన్యానికి చెందినవాడవు, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాము! ఎట్టిపరిస్థితిలో నీవు కళ్ళతో అగ్ని(నరకం) ని చూడవు అలాగే అగ్ని కూడా నిన్ను చూడలేదు మరియు నిన్ను తన ఆహరంగా చేసుకోలేదు.[1].
ఆంటోని బర్రా
ఆంటోని బర్రా ఒక క్రైస్తవ మతస్తుడు. అతనితో ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు మరియు అది పేపరులో కూడా వచ్చింది. ఆంటోని బర్రా తన పుస్తకంలో క్రైస్తవులు ఇమామ్ హుసైన్(అ.స) గురించి చెప్పిన మాటలన్నీంటిని సంగ్రహించి ఇలా అన్నాడు: ఇమామ్ హుసైన్(అ.స) అన్ని మతాలకు మరియు అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఎందుకంటే వారు చేసిన పని సార్వజనికమైనది, వారు సమాజానికి విముక్తినిచ్చే పని చేశారు. వారు హింసను అంతం చేయడానికి యుద్ధం చేశారు.
ఆ తరువాత ఇలా అన్నాడు: నాకు ఇమామ్ హుసైన్(అ.స) యొక్క రెండు ప్రత్యేకతలు చాలా నచ్చాయి; ఒకటి అతనిలో విప్లవాత్మకం మరియు ధైర్యం, రెండవది వినయం.
ఇతను అర్బయీన్ వాక్ లో కూడా పాల్గొన్నాడు.
ఇద్రీసె మగ్రిబీ
ఇద్రీసె మగ్రిబీ అహ్లె సున్నత్ కు చెందిన వారు. ఇతను షియాగా మారిపోయారు మరియు ఒకసారి ఇరాన్ కు కూడా వచ్చారు. “ఖద్ షయ్యఅనియల్ హుసైన్” (నన్ను హుసైన్ షియా చేశారు) అని ఒక పుస్తకం కూడా లిఖించారు. అతను ఇలా అన్నారు: నేను మా గ్రంథాలను పరిశీలించి చూశాను అందులో ఇమామ్ హుసైన్ గురించి చాలా గౌరవాన్ని చూశాను. వాటిలో ఇలా వ్రాశారు: ఇమామ్ హుసైన్(అ.స) స్వర్గ యువకుల నాయకుడు, దైవప్రవక్త(అ.స) అతనిని అతిగా ఇష్టపడే వారు మరియు దైవప్రవక్త(అ.స) అతనిని తన కుమారుడు అని. అహ్లెసున్నత్ మూల గ్రంథాలలో ఉన్న ఇలాంటి ఇమామ్ హుసైన్(అ.స) కు సంబంధించిన విశిష్టతలన్నీని ఒకేచోట సంగ్రహించాను. ఆ తరువాత ఒక సమూహం దైవప్రవక్త(అ.స) అతిగా ఇష్టపడేటువంటి వారిని చంపారు అని చూశాను. అలా నేను షియా యొక్క యదార్ధాలను తెలుసుకున్నాను మరియు షియా అయ్యాను.
ఈనాడు కూడా ఈ ప్రపంచంలో దైవప్రవక్త మనవడు ఇమామ్ హుసైన్(అ.స) ను చంపిన ఆ ఘాతకులను ఆచరించే కొందరున్నారు. వారు ఇస్లాంను తమ పనులతో అప్రతిష్టతకు పాలు చేస్తున్నారు.
ఈ హదీస్ మనకు చాలా విషయాలను చెబుతుంది. దానిని గ్రహించడానికి ప్రయత్నించండి.
రిఫ్రెన్స్
ఇబ్నె ఖూలవైహ్, కామిలుజ్జియారాత్, నాషిర్ అల్ మత్బఅతుల్ ముబారకతుల్ ముర్తజవియహ్, నజఫ్.
వ్యాఖ్యానించండి