ఇమామ్ హుసైన్(అ.స) పట్ల ప్రేమ

శుక్ర, 09/09/2022 - 16:13

అల్లాహ్ ఒకరికి మేలు చేయాలనుకున్నప్పుడు ఏమి చేస్తాడు అన్న విషయం గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) యొక్క హదీస్...

నాకు ఇమామ్ హుసైన్(అ.స) అంటే ఇష్టం

అల్లాహ్ ఒకరికి మేలు చేయాలనుకున్నప్పుడు అతడి హృదయంలో ఇమామ్ హుసైన్(అ.స) యొక్క జియారత్ ప్రేమను వేస్తాడు అని రివాయతులు వివరిస్తున్నాయి.[1] 

నేల పై గుడ్డను పరిచి గట్టిపడిపోయిన రొట్టెను తింటున్న కొంతమంది పేదవారి వైపు నుండి ఇమామ్ హుసైన్[అ.స] వెళ్తుండగా, వాళ్ళు ఇమామ్ ను ఆ రొట్టె తినడానికి ఆహ్వానించారు. ఇమామ్ హుసైన్[అ.స] గుర్రం నుండి దిగివచ్చి ఇలా అన్నారు: “గర్విష్టులకు ఆయన(అల్లాహ్) ఏమాత్రం ఇష్టపడడు”[నహ్ల్ సూరహ్:23].
ఆ బీదవారి వద్ద కూర్చున్నారు, వారితో కలిసి రొట్టెను తిన్నారు. ఆ తరువాత “నేను మీ ఆహ్వానాన్ని అంగీకరించాను, ఇప్పుడు మీరు కూడా నా ఆహ్వానాన్ని అంగీకరించి నా ఇంటికి రండి” అని ఇమామ్ అన్నారు. వాళ్ళు అంగీకరించారు. ఇమామ్ వాళ్ళను మంచి అతిథిమర్యాదలు చేశారు, వారిలో ప్రతీ ఒక్కరికి దరించడానికై దుస్తులు ఇచ్చారు. వారిని సంతోషరిచారు. మరియు ఇలా అన్నారు: “వీళ్ళు నా కన్నా దానశీలులు, ఎందుకంటే వీళ్ళు వీళ్ళవద్ద ఉన్నదంతా నిష్కపటంగా పెట్టేశారు, కాని నేను నా వద్ద ఉన్న దాని నుండి కొంచెమే వారికి ఇచ్చాను”.[2].
ప్రజలను పాలించడానికి ఇలాంటి స్వభావం గల మనిషే కావాలి. ఇలాంటి అభిప్రాయాలు గల మనిషి నాయకుడైతే ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు.

ఇమామ్ హుసైన్[అ.స] దైవప్రవక్త[స.అ] యొక్క మూడవ ఉత్తరాధికారి. తండ్రి అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స], తల్లి ఫాతిమ బింతె ముహమ్మద్[అ.స]. షాబాన్ నెల 3వ తారీఖు, హిజ్రీ యొక్క 4వ ఏట మదీనహ్ పట్టణంలో జన్మించారు. ముహర్రం నెల 10 వ తారీఖు, హిజ్రీ యొక్క 61వ ఏట కర్బలా(ఇరాఖ్) యుధ్ధభూమిలో మానవత్వ విలువల రక్షణ కోసం శత్రువులతో యుద్ధం చేసి వీరమరణం పొందారు.

ఇమామ్ హసన్[అ.స] తన జీవితకాలంలో ముఆవియాతో సంధీ చేశారు అందులో అతిముఖ్యమైన షరత్తు “ముఆవియా మరణాంతరం ఖిలాఫత్(పదవి), ఇమామ్ అలీ[అ.స] యొక్క వారసులకే చెందెను”. మరి ఇమామ్ హసన్[అ.స] 50వ హిజ్రీలో మరణించడం వల్ల వాస్తవానికి ఆ ఖిలాఫత్ పదవి ఇమామ్ హుసైన్[అ.స]కు దక్కాలి కాని ముఆవియా తన జీవితంలోనే తన తరువాత యజీదే ఖలీఫాగా ప్రచారం చేసుకున్నాడు. కాని ఇమామ్ హుసైన్[అ.స] అతడి బైఅత్
ను అంగీకరించలేదు. [3]

కర్బలా సంఘటన సంభవించిన తరువాత ఇస్లాం మరియు ముస్లిములలో చాల మార్పులు సంభవించాయి వాటికి చరిత్రే సాక్ష్యం చెబుతుంది వాటిలొ కొన్ని వాటిని మేము ఇక్కడ ప్రస్థావిస్తున్నాము:

1. చాలా మంది ఆలోచన తీరు బనీ ఉమయ్య ఖలీఫాల పట్ల మారింది. వారి రాజ్యాధికారం కేవలం అజ్ఙానం మరియు అన్యాయం, దౌర్జన్యం పై ఆధారపడి ఉన్నదని వారు తెలుసుకున్నారు. దీనికి కర్బలా సంఘటనే సాక్ష్యం.

2. ప్రజలకు సమాజంలో జరిగే దౌర్జన్యాన్ని మరియు అన్యాయాన్ని వ్యతిరేకించే ధైర్యం వచ్చింది దీనికి 65 హిజ్రిలో తవ్వాబీన్ లు బనీ ఉమయ్యా పై చేసిన యుధ్ధమే సాక్ష్యం.

3. కర్బలా మరియు ఆషూర ప్రపంచంలో జరిగే అన్యాయాలన్నింటికి వ్యతిరేకించే విప్లవమాత్మక అందోళనలకు ఒక యూనివర్సిటిగా మారాయి, దీనికి చరిత్రలో సంభవించిన ఎన్నొ విప్లవమాత్మక అందొలనలు సాక్ష్యం చెబుతున్నయి వాటిలొ ముఖ్యమైనవి క్యుబా,ఇరాన్,లిబియాలలొ జరిగిన అందోళనలు.

ఏది ఏమైనా కర్బలా గాధ మరియు ఇమాం హుసైన్(అ.స)ల వారి బలిదానం ప్రపంచంలో స్వాతంత్రం మరియు న్యాయం కోసం తాపత్రయపడేవారికి ఒక ఆదర్శంగా మారింది.

రిఫ్రెన్స్

3. షేక్ అబ్బాస్ ఖుమ్మి, ముంతహల్ ఆమాల్, ఇమామ్ హుసైన్[అ.స]కు సంబంధించిన అధ్యాయంలో.

2. హాజ్ షేఖ్ అబ్బాస్ షేఖుర్రయీస్, షాహ్కారె ఆఫరీనిష్, అస్రె జుహూర్, ఖుమ్, 1383. బెనఖ్ల్ అజ్: మఖ్తలె ఖారజ్మీ, భాగం1, పేజీ155.

రిఫరెన్స్
1. కామిల్ అల్ జియారాత్, పేజీ269.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17