అలుపెరగని సైన్యాధిపతి అయిన సర్దార్ షహీద్ ఖాసిమ్ సులైమానీ జీవిత చరిత్ర సంక్షిప్తంగా...
“ఇరాన్” యొక్క “కిర్మాన్” రాష్ట్రంలో ఉన్న “రాబర్” అనే సిటీకి చెందిన హసన్ సులైమానీ ఇంట మార్చి నెల 11వ తేది 1957లో ఒక పిల్లాడు జన్మించాడు. తండ్రి తన కుమారుడిని “ఖాసిమ్” అని పేరు పెట్టారు. ఖాసిమ్ 13 సంవత్సరాల వయసులో స్కూల్ చదువు పూర్తయిన తరువాత “రాబర్” పట్టణాన్ని విడిచారు. 18 ఏళ్ల వయసులో కిర్మాన్ లో Water Organization Contractor అయ్యారు. వారు కసరత్తు చేసేవారు అలాగే కరాటే నేర్చుకున్నారు, Bodybuilding Instructor గా కూడా యువకులకు శిక్షణ ఇచ్చేవారు.
ఇరాన్ స్వాతంత్రానికి రెండు సంవత్సరాల ముందు మష్హద్ చుట్టుప్రక్కల ప్రదేశానికి చెందిన హుజ్జతుల్ ఇస్లామ్ “రిజా కామియాబ్” కిర్మాన్ పట్టణానికి రమజాన్ మాసంలో వచ్చినప్పుడు వారితో పరిచయం పెరిగి విప్లవకారుల బృంధంతో కలిశారు. వారిద్దరి స్నేహం చాలా రోజుల వరకు సాగలేదు ముర్దాద్ మాసం 7వ తేది (ఇరానీ సంవత్సర కౌటింగ్ ప్రకారం) 1981వ సంవత్సరంలో “సాజెమానె ముజాహిదీనె ఖల్ఖ్” “కామియాబ్” ను హతమార్చారు. కాని ఆ కొద్ది కాలంలోనే “ఖాసిమ్ సులైమానీ”కు “మష్హద్” కు చెందిన ఆయతుల్లాహ్ “సయ్యద్ అలీ ఖామెనయీ” పరిచయమయ్యారు మరి వారి స్నేహం ఇప్పటి వరకు సాగుతూ వచ్చింది... కాని “సర్దార్ ఖాసిమ్ సులైమానీ” జనవరి 3వ తేది అర్ధరాత్రి తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర్వుల అనుసారం చంపబడ్డారు.[1]
సులైమానీ ఇరాన్ స్వాతంత్ర్యం తరువాత
ఇరాన్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, వారు పని చేసుకుంటూనే కిర్మాన్ లో ఉన్న “సిపాహె ఇఫ్తెఖారీ” సమూహానికి సభ్యుడయ్యారు. వారే స్వయంగా “విప్లవం కోసం శ్రమించాము, అందుకని ఆర్మీలో ప్రవేశించాను” అని అన్నారు. కాలం గడిచింది సులైమానీ కిర్మాన్ లో ఉన్న “ఖుద్స్” సైనికశిబిరానికి కమాండర్ అయ్యారు. 1980, సెప్టెంబర్ నెలలో ఇరాన్ మరియు ఇరాఖ్ మధ్య యుద్ధం మొదలయ్యింది, అప్పుడు వారు కిర్మాన్ లో కొన్ని బెటాలియన్స్ ను ట్రైనింగ్ ఇచ్చి దక్షిణ యుద్ధభూమికి పంపేవారు. వారు శత్రుసైన్యానికి అడ్డుగోడగా నిలిచేవారు, వాళ్లను ముందుకు రాకుండా ఆపేవారు, కొత్తగా ఆలోచించేవారు. ఈ విషయాలే ఖాసిమ్ సులైమానీ ఉనికి యొక్క ప్రభావాన్ని ఆ 8 సంవత్సరాల యద్ధంలో చూపించింది; ఉదాహారణకు “వల్ ఫజ్ర్”, “కర్బలా4”, “కర్బలా5”, “తక్ షలమ్చ” ఆపరేషన్స్ లో.
ఆ యుద్ధం అనంతరం, తన సైన్యంతో కిర్మాన్ కు తిరిగి వచ్చి తూర్పు నుండి ముఖ్యంగా అఫ్గానిస్తాన్ వైపు నుండి ప్రవేశిస్తున్న శత్రువులతో యుద్ధాన్ని సాగించారు.[2]
2001వ సంవత్సరంలో సుప్రీమ్ లీడర్ ఆయతుల్లాహ్ ఖామెనయి తరపు నుండి ఖుద్స్ సైన్యాధిపతిగా నిర్థారించబడ్డారు. వారి ఈ సైన్యాధిపత్యం యొక్క ప్రభావాన్ని లెబ్నాన్ లో ఉన్న హిజ్బుల్లాహ్ ను బలపచడంలో మరియు 33 రోజుల హిజ్బుల్లాహ్ యుద్ధంలో చూశాము. ఇరాన్ ఇతని సహాయంతో ఇరాఖ్, డమస్కస్ మరియు యమన్ వరకు తన ప్రభావాన్ని చూపగలిగింది.
సర్దార్ సులైమానీ ఇరాఖ్ మరియు డమస్కస్ లో దాయిష్ లతో యుద్ధం చేసిన సైన్యాథిపతులలో ఒకరు. దాయిషులు అనగా సద్దామ్ అధికారం కూలిపోయిన తరువాత సలఫీ వర్గానికి చెందిన సమూహం, వాళ్లు ఇరాఖ్ లో మెల్లమెల్లగా తన బలాన్ని పెంచుకుంటూ పోయారు, ఈ సమూహం ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రవాదుల సమూహం. ప్రజల రక్షణ చర్యగా ఇరాన్ ఆ సమూహంతో యుద్ధాన్ని మొదలు పెట్టింది. ఖాసిమ్ సులైమానీ ఇరాఖ్ మరియు డమస్కస్ గవర్నమెంట్ అధికార అభ్యర్థన ద్వారా కొత్త మిషన్ మొదలు పెట్టరు. ఇరాఖ్ లో “షహ్దుష్ షఅబీ” మరియు డమస్కస్ లో “బసీజె మర్దుమీ” లను ఏర్పాటు చేసి వారి సహాయం మరియు ఖుద్స్ సైన్యం సలహాలతో, 6 సంవత్సరాలలో ఆ రెండు దేశాల నుండి దాదాపు టెర్రరిష్టులను అంతం చేశారు.
మార్చి నెల 19వ తేదీ 2019వ సంవత్సరం లో సుప్రీమ్ లీడర్ ఆయతుల్లాహ్ ఖామెనయీ వారికి జుల్ఫిఖార్ బ్యాడ్జ్ (ఇరాన్ యొక్క అత్యున్నత సైనిక చిహ్నం) సర్దార్ ఖాసిమ్ సులైమానీకు ఇచ్చారు. ఇరాన్ కు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ బ్యాడ్జ్ ను పొందిన మొట్ట మొదట వ్యక్తి ఖాసిమ్ సులైమానీ.
నిన్ను చంపేస్తామని నిత్యం హెచ్చరించేవారు శత్రువులకు నిత్యం సర్దార్ షహీద్ సులైమానీ ఇలా చెప్పేవారు.. ఇది హెచ్చరిక కాదు, నా కోరికకు సహాయం. ఎవరైతే ఈ హెచ్చరికలతో మాపై అధికారం చెలాయించాలనుకుంటున్నారో వారికి చెబుతున్నాను ..ఓఅల్లాహ్ నీ మార్గంలో నీ ధర్మ శత్రువుల చేతుల్లో నాకు షహాదత్ ను ప్రసాదించు.. శత్రువులు ఇలాంటి ఔదర్యాన్నీ సహనాన్నీ తట్టుకోలేకపోయారు. అలుపెరగని ఈ సైన్యాధిపతిని జనవరి నెల 3వ తేదీ 2020వ సంవత్సరంలో రాకెట్ తో సర్దార్ వెళ్తున్న కారుపై దాడి చేసి చంపారు.
వారి జీవితాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే “గొప్పగా జీవించారు మరియు గొప్పగా మరణించారు”[3]
రిఫరెన్స్
1. తహ్లీలియె ఖబరియె అస్రె ఇరాన్/ హౌజా నెట్.కామ్
2. తహ్లీలియె ఖబరియె అస్రె ఇరాన్/ హౌజా నెట్.కామ్
3. https://hawzah.net/fa/Mostabser/View/63456/2529/زندگینامه
వ్యాఖ్యలు
Aise shaheedon ko salam
వ్యాఖ్యానించండి