గైబతె సుగ్రా, గైబతే కుబ్రా మరియు గైబతె సుగ్రా సమయంలో ఇమామ్[అ.స] యొక్క ప్రతినిధులు ఎవరు అన్న విషయం పై సంక్షిప్త వివరణ.
ఇమామ్[అ.స] మనకు కనిపించకుండా అదృశ్యంగా ఉన్న కాలాన్ని రెండుగా విభజించడం జరిగింది: 1. గైబతే సుగ్రా 2. గైబతే కుబ్రా.
గైబతే సుగ్రా కాలం అనగా ఆ రోజుల్లో ఇమామ్[అ.స] మరియు ప్రజల మధ్య ఇమామ్ తరపు నుండి నియమించబడ్డ ప్రతినిధులు ఉండేవారు. వాళ్ళు ఇమామ్[అ.స] మరియు ప్రజల మధ్యస్థులుగా ఉండేవారు. వాళ్ళు ఇమామ్[అ.స]ను కలిసే వారు. ఇమామ్ వారికి తప్ప మరెవ్వరికీ కనబడేవారు కాదు. కొంతకాలం తరువాత “గైబతే కుబ్రా” కాలం మొదలయ్యింది. గైబతే కుబ్రా కాలంలో ఇక ఇమామ్ ఎవ్వరికి కనబడకుండా అదృశ్యమయ్యారు. ఇమామ్[అ.స] మరలా అల్లాహ్ ఆజ్ఞతో ప్రత్యేక్షమయ్యే వరకు “గైబతే కుబ్రా” కాలం సాగుతూనే ఉంటుంది. ఇప్పుడు మేము “గైబతే కుబ్రా” కాలంలో ఉన్నాము.
ఆ “గైబతే సుగ్రా” కాలంలో ఉన్న ఇమామ్[అ.స] ప్రతినిధుల నలుగురు. వారిని “నవ్వాబె అర్బఅహ్” అంటారు. వారి పేర్లు:
1. అబూ అమ్ర్ ఉస్మాన్ ఇబ్నె సయీదె అమ్రీ
2. అబూజాఫర్ ముహమ్మద్ ఇబ్నె ఉస్మాన్ ఇబ్నె సయీదె అమ్రీ
3. అబుల్ ఖాసిమ్ హుసైన్ ఇబ్నె రౌ(రూ)హె నౌబఖ్తీ
4. అబుల్ హసన్ అలీ ఇబ్నె ముహమ్మదె సమరీ [ఆయానుష్షియా, భాగం2, పేజీ48].
రిఫ్రెన్స్
సయ్యద్ మొహ్సిన్ అమీన్, ఆయానుష్షియా, భాగం2, పేజీ48.
వ్యాఖ్యలు
Masha Allah....
Good info
Shukriya... Iltemase Dua.
Shukriya... iltemase dua.
వ్యాఖ్యానించండి