పరధ్యానం, అశ్రద్ధ మరియు నిర్లక్ష్యం ఇవన్నీ మనిషికి తప్పుదారి పట్టిస్తాయి. వారు సరిగా ఆలోచించలేరు, అలాంటి వారు చాలా మంది ఉంటారు అని ఖుర్ఆన్ వివరిస్తుంది.
ఖుర్ఆన్ దృష్ఠిలో పరధ్యానం, నిర్లక్ష్యం మార్గభ్రష్టతకు కారణం. దాని ద్వార మనిషికి కేవలం జీవితం యొక్క బాహ్యరూపం మాత్రమే కనిపిస్తుంది. దానిలో ఉన్న అంతర్యాన్నీ, యదార్ధాన్ని అనగా పరలోకాన్ని గ్రహించడు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “వారికి ప్రాపంచిక జీవితపు పై పై విషయాలు(మాత్రమే) తెలుసు. పరలోకం గురించి వారికి బొత్తిగా తెలియదు”[రూమ్:7].
అల్లాహ్ చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు అని సూచించెను: “యదార్థమేమిటంటే జనులలో చాలామంది మా సూచనలను నిర్మక్ష్యం చేస్తారు”[యూనుస్:92].
సూచించడంతో పాటు అల్లాహ్ మమ్మల్ని అభిముఖిస్తూ నిర్గక్ష్యం చేసేవారిలో చేరకుండా ఉండు అని హెచ్చరించాడు: “నిర్లక్ష్యం చేసేవారిలో నీవు చేరకు”[ఆరాఫ్:205].
వ్యాఖ్యానించండి