"బఖీ" స్మశానం చరిత్ర ఇస్లాం రాకా ముందు నుండే మొదలవుతుంది కాని ఎప్పటి నుండీ అనేది చరిత్రలో స్పష్టంగా లిఖించబడి లేదు. బఖీ స్మశానం గురించి సంక్షిప్తంగా.
“బఖీ” కేవలం ఒక స్మశానం కాదు, అది ఒక ఇస్లామీయ చరిత్ర యొక్క నిధి. అందులో నాలుగు పవిత్ర మాసూము[అ.స]ల సమాధులున్నాయి. అలాగే ఒక వచనానుసారం దైవప్రవక్త[స.అ] కుమార్తే సమాధి ఉంది. అలాగే సహాబీయుల మరియు తాబెయీన్ల భార్యల, కుమారుల మరియు కుమార్తెల సమాధులు మరియు దైవప్రవక్త[అ.స] దగ్గర సంబంధీకుల సమాధులు కూడా ఉన్నాయి. ఇంచుమించు పది వేల ఇస్లామీయ ప్రముఖులు అక్కడే సమాధి అయి ఉన్నారు.
చరిత్ర గ్రంథాల ప్రకారం మదీనహ్ వాసులు హిజ్రత్ కన్నా ముందు తమ పూర్వీకుల మృతదేహాలను రెండు స్మశానాలు “బనీ హరామ్” లేదా “బనీ సాలిమ్”లో సమాధి చేసేవారు. కొన్ని సమయాలలో తమ సొంత ఇంట్లోనే సమాధి చేసేవారు. కాని మదీనహ్ పట్టణానికి ముస్లిముల హిజ్రత్ తరువాత “బఖీ” కేవలం ముస్లిముల స్మశానంగా మారింది, కాలక్రమేణా మరియు సహాబీయుల, తాబెయీనుల సంబంధీకుల మరియు దైవప్రవక్[స.అ] అహ్లెబైత్[అ.స] సమాధుల ద్వాల దానికో ప్రత్యేకత ఏర్పడింది.[తారీఖు హరమె అయిమ్మతిల్ బఖీ, పేజీ61].
రిఫ్రెన్స్
ముహమ్మద్ సాదిఖ్ నజఫీ, తారీఖు హరమె అయిమ్మతిల్ బఖీ, ముఅస్ససయే ఫర్హంగీ వ ఇత్తెలా రసానీయే తిబ్యాన్, ఖుమ్, 1387.
వ్యాఖ్యలు
Jazakallah
Good information
Shukriya.. Iltemase dua.
Jazakallah
వ్యాఖ్యానించండి