దైవప్రవక్త[స.అ] వచనానుసారం వారి ఉమ్మత్ లో నాలుగు రకాల మనుషులున్నారు దానిని ఖుర్ఆన్ కూడా వివరించింది.
1. నమాజ్ పట్ల అశ్రద్ధ వహించువారు: "ఆ నమాజీలకు వినాశం తప్పదు('వైల్' అనే నరక స్థానం వారి కొరకు ఉంది). (ఎందుకంటే) వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు.[మాఊన్:4,5].
2. అప్పుడప్పుడూ నమాజ్ చదివేవారు: "ఆ తరువాత కొందరు అనర్హులు వచ్చి, నమాజును వృధా చేశారు, మనోవాంఛలను అనుసరించసాగారు. తమకు కలిగిన నష్టం గురించి వారి మున్ముందు చూసుకుంటారు.[మర్యమ్:59].
3. అస్సలా నమాజు చదవని వారు: "ఇంతకీ ఏ విషయం మిమ్మల్ని నరకానకి తీసుకువచ్చింది?" (అని ప్రశ్నిస్తారు) వారిలా సమాధానమిస్తారు: "మేము నమాజు చేసేవారము కాము"[ముద్దస్సిర్:42,43].
4. నిరంతరం నమాజ్ చదివేవారు: "నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు. వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు.[మొమినూన్:1,2]. "నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు).[అన్కబూత్:45].
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... Iltemse dua.
వ్యాఖ్యానించండి