ఇమామ్ అలీ[అ.స] స్వర్ణపలుకులను సమకూరుస్తూ రచించిన గ్రంథం అయిన నెహ్జుల్ బలాగహ్ రచయిత గురించి సంక్షిప్తంగా.
పేరు ముహమ్మద్, బిరుదు “సయ్యద్ రజీ”. అతను హిజ్రీ యొక్క 359వ సంవత్సరం బగ్దాద్ పట్టణంలో జన్మించారు. హిజ్రీ యొక్క 407వ ఏట 47 సంవత్సరాల వయసులో మరణించారు. తండ్రి పేరు హుసైన్ ఇబ్నె అహ్మద్, తల్లి పేరు ఫాతెమా జహ్రా. వారి వంశం విజ్ఞానుల, పండితుల వంశం. అలీ అలముల్ హుదా అనగా సయ్యద్ ముర్తుజా[ర.అ], సయ్యద్ రజీ[ర.అ] యొక్క సొదరులు. సయ్యద్ రజీ[ర.అ] కన్నా వారు నాలుగు సంవత్సరాల పెద్దవారు. సయ్యద్ ముర్తుజా[ర.అ] షియా వర్గానికే గౌరవం.
సయ్యద్ రజీ[ర.అ] 17 సంవత్సరాల వయసు నుండే విధ్యాబోధన మరియు రచనలు మొదలు పెట్టారు. వారు చాలా శిష్యులను తీర్చిదిద్దారు. వారు రచించిన గ్రంథాలలో అముల్యమైన గ్రంథం “నెహ్జుల్ బలాగహ్” దీనిని అతను హిజ్రీ యొక్క 400వ సంవత్సరంలో రచించారు.
రిఫ్రెన్స్
ఇబ్నె అబిల్ హదీద్, షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం1, పేజీ31.
వ్యాఖ్యలు
Mashallah
Shukriya... Iltemase dua.
వ్యాఖ్యానించండి