నాయకుడనే వాడు ప్రజల సంతోషాలలో తోడుగా ఉండకపోయిన పరవాలేదు కాని వారి కష్టాలలో తప్పకుండా తోడుగా ఉండాలి.
మదీనహ్ పట్టణంలో గోదుమ మరియు రొట్టెల ధరలు రోజురోజుకు పెరుగుతూ పొతున్నాయి. అందరూ ఆదోళనకు గురి అవుతున్నారు. సంవత్సరానికి సరిపడ ఆహారమును భద్రపరచుకోలేకపోయినవారు భద్రపరిచే ప్రయత్నాలలో ఉన్నారు, భద్రపరుచుకున్నవారు దానిని కాపాడుకునే పనిలో ఉన్నారు. ఇటూఅటూ కాకుండా మధ్యలో నిస్సహాయులు, బీదవారు ప్రతీరోజు బజారు నుండి ఆహారాన్ని కొనుక్కునే వారు కూడా ఉన్నారు. ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స] తన ఇంటి ఆహారపు బాధ్యుడు అయిన "ముత్అబ్"తో ఇలా అడిగారు: “ఈ సంవత్సరం ఇంట్లో గోదుమలున్నాయా?” “ఉన్నాయి ప్రవక్త కుమారా! కొన్ని నెలలకు సరిపడే గోదుమలు ఉన్నాయి” అని అన్నాడతను. ఇమామ్, వాటిని బజారుకు తీసుకెళ్ళి ప్రజలకు అందుబాటులో పెట్టు వారు కొనుక్కుంటారు, అన్నారు. ప్రవక్త కుమారా! మదీనహ్ లో గోదుమలు లేవు, ఇవి అమ్మేస్తే ఇక గోదుమలు మనకు దొరకవు అని అతడన్నాడు.
ఇమామ్ ఇలా అన్నారు: చెప్పింది చేయి. అంతా ప్రజలకు అందుబాటులో ఉంచు, వాటిని అమ్మేయి. “ముత్అబ్” ఇమామ్ ఆజ్ఞను పాటిస్తూ గోదుమలను అమ్మి లాభాన్ని తెలియపరిచాడు. ఇమామ్, ఇప్పటి నుండి కావలసినంత ప్రతిరోజు బజారు నుండి కొనండి, ఇలాంటి పరిస్థితులలో నా ఇంట్లో తయారు చేయబడే రొట్టె ఇతర ప్రజలు తినే రొట్టెకూ తేడా ఉండ కూడాదు. ఇప్పటి నుండి నా ఇంటి రొట్టె సగం గోదుమలు మరియు సగం యవలు(బార్లీ గింజలు)లతో తయారు చేయండి. అల్లాహ్ దయతో నేను సంవత్సరం చివరి వరకు గోదుమ రొట్టెను తిన గలను కాని అలా చేయను.[బిహారుల్ అన్వార్, భాగే11, పేజీ121]
రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, చాపే కొంపానీ.
వ్యాఖ్యలు
Masha Allah
Shukriya ... Jazakallah.
Mashaallah
Shukriya .. Iltemase dua.
వ్యాఖ్యానించండి