ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] హిజ్రీ యొక్క 260వ సంవత్సరం, రబీవుల్ అవ్వల్ యొక్క 8వ తేది, శుక్రవారం నాడు హతమార్చబడ్డారు.
షియా ఉలమాలు ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] విషప్రయోగం ద్వార మరణించారు అని నమ్ముతారు. అలాగే వారి తండ్రి, వారి పితామహులు మరియు మిగతా ఇమాములందరూ కూడా చంపబడ్డారు అనే విశ్వసిస్తారు. అందుకు ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] మరియు ఇమామ్ అలీ రిజా[అ.స]ల రివాయత్ ద్వార నిదర్శిస్తారు. వారు ఇలా ప్రవచించారు: “అల్లాహ్ సాక్షిగా! మాలో ఏ ఒక్కరు కూడా లేరు షహీద్ అయినవారు తప్ప”(అనగా అందరూ హతమార్చబడతారు).
ఇమామ్ హసన్ అస్కరీ[అ.స] హిజ్రీ యొక్క 260వ సంవత్సరం, రబీవుల్ అవ్వల్ యొక్క 8వ తేది, శుక్రవారం నాడు హతమార్చబడ్డారు.
వారు మరణించిన తరువాత వారి షియాలు వారి పై జనాజహ్ నమాజ్ చదవడం కోసం వారి ఇంటికి వద్దకు వచ్చారు. వారి సోదరుడు “జాఫర్” ఇమామ్ యొక్క జనాజహ్ నమాజ్ చదివించడానికై సిద్ధమయ్యి ముందుకు వెళ్ళాడు ఇంతలో అక్కడున్న వారు ఒక యువకుడు వచ్చి జాఫర్ దుస్తులను పట్టి ఇమామ్ మృతదేహం నుండి దూరంగా జరిపి స్వయంగా అతనే జనాజహ్ నమాజ్ ను చదివించడాన్ని చూశారు. ప్రజలు కూడా వారితో పాటు జనాజహ్ నమాజ్ ను చదివారు. ఆ తరువాత వారు అక్కడి నుండి జరిగారు, మరి కనిపించకుండాపోయారు. జనానికి వారు ఎటువైపు వెళ్ళిపోయారో తెలియలేదు.[కమాలుద్దీన్ వ తమామున్నెఅమహ్, భాగం2, పేజీ475].
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, కమాలుద్దీన్ వ తమామున్నెఅమహ్, దారుల్ కుతుబిల్ ఇస్లామియహ్, చాప్2, తెహ్రాన్,1395ఖ.
వ్యాఖ్యానించండి