కర్బలా యుద్ధభూమి పై యుద్ధం అనంతరం ౙుల్ జనాహ్ గుర్రం ఏమైపోయినట్లు అన్న ప్రశ్నకు పలు గ్రంథాల ఉల్లేఖనలు.
ప్రశ్న: కర్బలా సంఘటన తరువాత “ౙుల్ జనాహ్” ఏమయ్యింది.
జవాబు: ఇమామ్ హుసైన్ యొక్క గుర్రం పేరు “ౙుల్ జనాహ్”. దీని గురించి సరైన “మఖ్తల్” గ్రంథాలలో ఇలా ఉంది: “ఇమామ్ హుసైన్[అ.స] చంపబడిన తరువాత వారి గుర్రం తనను ఇమామ్ హుసైన్[అ.స] యొక్క రక్తంతో నింపుకొని అహ్లె హరమ్ యొక్క డేరాల వైపుకు అరుస్తూ వెళ్ళింది. అహ్లె హరమ్ దాని అరపులతో డేరాల నుండి బయటకు వచ్చి ఇమామ్ హుసైన్[అ.స] మరణించారు అన్న విషయాన్ని తెలుసుకున్నారు.
కాని మరికొన్ని మఖాతిల్ గ్రంథాల ఉల్లేఖనం ప్రకారం, ఉదాహరణకు “నాసిఖుత్తవారిఖ్” గ్రంథం. మరో విధంగా ఉల్లేఖించ బడి ఉంది: “ఆ గుర్రం డేరాల ముందు తన తలను తన ప్రాణం పోయే వరకు నేలకు బాదుకొంది” లేదా ఇలా కూడా ఉంది” “ఫురాత్ వైపుకు వెళ్ళి ఆ ఫురాత్ నీళ్ళలో దూకేసింది” అని.[నాసిఖుత్తవారిఖ్, భాగం6, పేజీ2].
రిఫ్రెన్స్
సిపహ్ర్, మీర్జా ముహమ్మద్ తఖీ, నాసిఖుత్తవారిఖ్, ఇస్లామియహ్, 1385.
వ్యాఖ్యలు
Jazakallah
Shukriya...
Masha allah
Shukriya...
Masha allah
Shukriya.. jazakallah
వ్యాఖ్యానించండి