అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ ప్రవక్త హజ్రత్ లూత్[అ.స] గురించి సంక్షిప్త వివరణ.
హజ్రత్ ఇబ్రాహీమ్[అ.స] ఇరాఖ్ నుండి “బాబిల్” ప్రాంతానికి చెందిన “షామాత్”కు వెళ్ళారు అని తెలుసు. ఈ విధంగా తెలిసే విషమేమిటంటే హజ్రత్ లూత్[అ.స] కూడా వారితోనే కలిసి నివసించేవారు. కాని కొంతకాలం తరువాత వారు తౌహీద్ ప్రచారం మరియు దౌర్జన్యంతో పోరడడం కోసం “సదూమ్” అనబడే పట్టణానికి వెళ్ళిపోయారు.
“సదూమ్” పట్టణం “లూత్ వర్గం” నివసించే పట్టణం, ఈ ఉర్దున్ పట్టణంలో ఉన్న “షామాత్”కు చెందినది. ఈ నేల ప్రజలతో నిండుగా మరియు చెట్లతో, పంటలతో పచ్చగా ఉండే నేల, కాని సిగ్గూ, బిడియాలు విడిచి ప్రకృతికి విరుద్ధ కార్యములు చేయడంతో అల్లాహ్ తరపు నుండి విధించబడిన శిక్షతో ఆ నేల తలక్రిందులయ్యింది.
కొందరు ఆ పట్టణాలు నీళ్ళతో నిండిపోయాయి అని అంటారు. మరి కొందరు ఆ పట్టణాలు నీళ్ళతో నిండిపోలేదు ఇప్పటికీ “బహ్రుల్ మయ్యిత్” అనే ప్రదేశానికి దగ్గరలో నల్లరాళ్ళ క్రింద కప్పబడి ఉన్నాయి, బహుశ అవి ఆ పట్టణాలే అయి ఉండవచ్చు అని నమ్ముతారు. ఇలా చాలా మంది చాలా రకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. [తఫ్సీరె నమూనహ్, భాగం22, పేజీ371].
తెలిసే విషమేమిటంటే లూత్ వర్గం వారు అల్లాహ్ శిక్షకు గురి అయ్యారు.
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబుల్ ఇస్లామియహ్, చాప్26.
వ్యాఖ్యానించండి