అల్లాహ్ తరుపు నుండి అవతరించబడ్డ ప్రవక్త హజ్రత్ నూహ్[అ.స] గురించి సంక్షిప్త వివరణ.
హజ్రత్ నూహ్[అ.స] అల్లాహ్ తరపు నుండి ప్రజల హిదాయత్ కోసం అవతరించబడ్డ గొప్ప ప్రవక్తలలో ఒకరు. ఖుర్ఆన్ యొక్క 29 సూరహ్ లలో వారి ప్రస్తావన ఉంది. వారి పేరు పూర్తి ఖుర్ఆన్ లో 43 సార్లు వచ్చింది. ఖుర్ఆన్ వారి జీవితం యొక్క పలు భాగాలను చాలా స్పష్టంగా వివరించింది, ముఖ్యంగా విజ్ఞానం, శిక్షణ, హితబోధన గురించి ఎక్కువ చెప్పడం జరిగింది.
చరిత్రకారులు మరియు ఖుర్ఆన్ వ్యాఖ్యులు ఇలా ఉల్లేఖించారు: హజ్రత్ నూహ్[అ.స] యొక్క పేరు “అబ్దుల్ గఫ్ఫార్” లేదా “అబ్దుల్ మలిక్” లేదా “అబ్దుల్ అఅలా”. “నూహ్” వారి బిరుదు అనగా శోకించువాడు, రోదించువాడు దానికి కారణం సంవత్సరాల తరబడి వారు తమ లేదా తమ వర్గం కోసం రోదించారు, దాంతో వారికి “నూహ్” అనే బిరుదు వచ్చింది. వారు తండ్రి పేరు “లమక్” లేదా “లామక్”.
వారు వయసు విషయంలో కూడా వివిధ అభిప్రాయాలు ఉల్లేఖించబడి ఉన్నాయి; కొందరు 1490 సంవత్సరాలని, మరికొందరు 2500 సంవత్సరాలని అంటారు. నిర్ధారితమేమిటంటే వారు సుదీర్ఘ వయసు కలిగి ఉన్నారు. ఖుర్ఆన్ ప్రకారం వారు 950 సంవత్సరాలు తన వర్గంలో రుజుమార్గ ప్రచారం చేశారు.
హజ్రత్ నూహ్[అ.స] సంతానం: 1. హామ్, 2. సామ్, 3. యాఫిస్. చరిత్రకారుల ఉల్లేఖనం ప్రకారం భూమి పై ఉన్న అన్ని వర్గాల వారు ఆ ముగ్గురి సంతానం.
హజ్రత్ నూహ్[అ.స], తుఫాను తరువాత 50 లేదా 60 సంవత్సరాల తరువాత మరణించారు అని అంటారు. యూదుల గ్రంథం(ఇప్పటి తౌరైత్)లో కూడా వారి జీవిత చరిత్ర ఉంది కాని అది ఖుర్ఆన్ వివరణకు చాలా భిన్నంగా ఉంది. మరి ఈ భిన్నత్వమే తౌరైత్ ప్రక్షిప్తానికి గురైయ్యింది అనడానికి నిదర్శనం.
నూహ్ కు ఇంకో కుమారుడు ఉండేవాడు. అతడి పేరు “కన్ఆన్” ఇతడు తన తండ్రికి వ్యతిరేకించి, హజ్రత్ నూహ్[అ.స] తుఫాను నుండి సురక్షితంగా ఉండేందుకు తయారు చేసిన ఓడపై ఎక్కకుండా అవిశ్వాసులతో సహవాసించి దౌత్యకుటుంబ సభ్యతను పోగొట్టుకున్నాడు. ఖుర్ఆన్ వివరణ ప్రకారం అతడు కూడా అవిశ్వాసులతో పాటు తుపానుకు గురి అయ్యాడు.
ఎంతమంది హజ్రత్ నూహ్[అ.స] ను విశ్వసించి రుజుమార్గం పొందారు అన్న విషయంలో కూడా వివిధ ఉల్లేఖనలు ఉన్నాయి; కొందరు 80 మంది అని మరి కొందరు 7 గురు అని ఉల్లేఖించారు.[తఫ్సీరె నమూనహ్, భాగం25, పేజీ99].
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ మకారిమ్ షీరాజీ, తఫ్సీరె నమూనహ్, దారుల్ కుతుబుల్ ఇస్లామియహ్, చాప్28.
వ్యాఖ్యానించండి