అల్లాహ్ హజ్రత్ నూహ్[అ.స]ను విగ్రాహారాధన చేసే ఒక జాతి యొక్క రుజుమార్గం కోసం అవతరింపజేసెను.
హజ్రత్ నూహ్[అ.స] యొక్క జాతి వారు విగ్రాహారాధన చేసేవారు. వారి దైవాల గురించి ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది., నూహ్[అ.స] జాతి వారు ఇలా అన్నారు: “ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదలకండి. వద్ద్ను గానీ, సవాను గానీ, యగూస్, యవూఖ్ నస్ర్ లను గానీ వదలి పెట్టకండి”[నూహ్:23].
అల్లాహ్ నూహ్[అ.స]ను వారి వద్దకు పంపాడు; ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రవచించెను: “మేము నూహ్[అ.స]ను ప్రవక్తగా చేసి అతని జాతి వద్దకు పంపాము” (హజ్రత్ నూహ్[అ.స] వారితో ఇలా అన్నారు): “నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించేవాడను. మీరు అల్లాహ్ ను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించబడతారేమోనన్న భయం నాకుంది” అప్పుడు అతని జాతికి చెందిన అవిశ్వాసుల సర్దారులు ఇలా సమాధానమిచ్చారు: “మా దృష్టిలో నువ్వు మాలాంటి ఒక మానవ మాత్రుడివే తప్ప మరేమీ కావు. ఇంకా మేము గమనిస్తున్నాము, మాలోని అల్పులైనవారే ఆలోచించకుండా, అర్ధం చేసుకోకుండా నిన్ను అనుసరిస్తున్నారు. కనుక మాపై మీకెలాంటి ప్రాధాన్యతగాని ఉన్నట్లు కానరావటం లేదు. పైగా మేము మిమ్ముల్ని అబద్ధాలకోరులుగా భావిస్తున్నాము”.
నూహ్[అ.స] ఇలా అన్నారు: “నా జాతివారలారా! ఒకవేళ నేను నా ప్రభువు తరపున వచ్చిన స్పష్టమైన నిదర్శనం పై ఉండి, ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగాన్ని కూడా కలుగజేసి ఉండి, అది మీకు కనిపించకపోతే (నేనేం చేయను?!) మీకిష్టం లేకపోయినా బలవంతంగా మేము దాన్ని మీ మీద ఎలా రుద్దగలం?”[హూద్:25-27].
వ్యాఖ్యలు
Mashaallah
Mashaallah
Shukriya Jazakallah
Excellent
Shukriya.. Iltemase dua...
MashaAllah.....good information
Shukriya... iltemase dua.
వ్యాఖ్యానించండి