తఫాను నుండి హజ్రత్ నూహ్[అ.స] మరియు వారిని విశ్వసించినవారిని రక్షణ కలిపించడం కోసం అల్లాహ్ వారిని ఓడను నిర్మించమని ఆదేశించాడు.
హజ్రత్ నూహ్[అ.స] అల్లాహ్ తో “నా ప్రభూ! నా జాతివారు నన్ను ధిక్కరించారు. కాబట్టి నీవు నాకూ – వారికీ మధ్య ఏదైనా అంతిమ నిర్ణయం చెయ్యి. నన్నూ, నాతో ఉన్న విశ్వాసులనూ కాపాడు” అని ప్రార్థించిన తరువాత అల్లాహ్ వారి ప్రార్థనను అంగీకరించి వారి జాతివారిని నాశనం చేయడానికి నిర్ణయించుకున్న తరువాత హజ్రత్ నూహ్ మరియు వారిని విశ్వసించినవారి యొక్క విముక్తి కోసం అల్లాహ్ హజ్రత్ నూహ్[అ.స] వద్దకు ఇలా వహీ పంపెను: “నీ జాతివారిలో (ఇంతవరకూ) విశ్వసించినవారు తప్ప, ఇక మీదట ఎవరూ విశ్వసించబోరు. కాబట్టి నువ్వు వారి చేష్టలపై దుఃఖించకు. మా కళ్ళ ముందరే, మా వహీ అనుసారం ఒక ఓడను తయారు చేయ్యి. మా ముందు దుర్మార్గుల ఊసు ఎత్తకు; వారంతా ఎలాగూ ముంచివేయబడేవారే”[హూద్:36,37].
ఆ తరువాత హజ్రత్ నూహ్[అ.స] ఓడ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. అతని జాతి నాయకులలో అతని వద్ద నుంచి వచ్చీపోయేవారంతా అతన్ని ఎగతాళి చేసేవారు. అప్పుడు హజ్రత్ నూహ్[అ.స] వారితో ఇలా అనే వారు: “మీరు మా స్థితిపై నవ్విపోతున్నారా? మీరు మా స్థితిపై నవ్విపోతున్నట్లే మేము కూడా ఒకనాడు మీ స్థితిపై నవ్వుతాము. పరాభవానికి గురిచేసే శిక్ష, శాశ్వతంగా ఉండే శిక్ష ఎవరిపై వచ్చిపడుతుందో అతి త్వరలోనే మీకు తెలిసిపోతుంది”[హూద్:38,39].
వ్యాఖ్యలు
MashaAllah....
Thanks to wilayat team
Shukriya... Iltemase dua.....
Mashaallah
Shukriya... jazakallah.
వ్యాఖ్యానించండి