హజ్రత్ నూహ్[అ.స] ప్రార్థనతో వచ్చిన తుఫాను ఎలా సమాప్తమయ్యింది మరియు అల్లాహ్ ఈ సంఘటన ఎవరి కోసం అల్లాహ్ చెబుతున్నాడు అన్న అంశాల పై సంక్షిప్త వివరణ.
ఎప్పుడైతే అవిశ్వాసులు తుఫాను ప్రభావంతో నాశనమయ్యారో అప్పుడు భూమ్యాకాశాలకు “ఓ భూమీ! నీ నీళ్ళంతటినీ మ్రింగెయ్యి. ఓ ఆకాశమా! ఇక ఆగిపో (కురిసింది చాలు)!” అని సెలవీయబడింది. అప్పటికప్పుడే నీరంతా ఇంకిపోయింది. కావలసిన పని పూర్తయింది. ఓడ ‘జూదీ’ పర్వతంపై నిలించింది. “దుర్మార్గులు (అల్లాహ్) అభిశాపానికి గురవుదురుగాక!” అని సెలవీయబడింది.[హూద్:44].
ఓడ నిలిచిన తరువాత హజ్రత్ నూహ్[అ.స]కు ఈ విధంగా సెలవీయబడింది: “ఓ నూహ్! మా తరపు నుండి ప్రశాంతంగా దిగు. నీపైన, నీతోటి వారిపైన శుభాలు కలుగుతాయి. ఇంకా అనేక సమూహాలకు కూడా మేము తప్పకుండా లాభం చేకూర్చుతాము. కాని తత్వాత వారికి మా తరపున బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది”.[హూద్:48].
హజ్రత్ నూహ్[అ.స] మరియు వారి జాతివారి గురించి అల్లాహ్ దైవప్రవక్త[స.అ]తో చెప్పి ఇలా అనేను: “ఇవి అగోచర సమాచారాలు. వీటిని మేము నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. ఇంతకు మునుపు నీకు గానీ, నీ జాతి వారికిగానీ వీటి గురించి ఏమీ తెలియదు. కనుక నీవు ఓర్పు వహీస్తూ ఉండు, నిస్సందేహంగా సత్ఫలితం భయభక్తులు గలవారికే లభిస్తుంది”[హూద్:49].
వ్యాఖ్యలు
MashaAllah
Shukriya ... jazakallah
Mashallah
Mashaallah
Mashaallah
వ్యాఖ్యానించండి