మరణించినవారిని అల్లాహ్ మరలా ఎలా ప్రాణం పోసి బ్రతికిస్తాడు అన్న విషయం పై ఖుర్ఆన్ వివరణ.
చావు యదార్థమని అందరికి తెలుసు. మరియు మరణించిన తరువాత ప్రళయదినాన మరలా ప్రాణం పోసి లేపబడతారు అని కూడా నమ్ముతారు. ఇది కూడా యదార్థమే. అల్లాహ్ ఖుర్ఆన్ల లో దీనిపై సాక్ష్యాలు కూడా ప్రదర్శించాడు. ఖుర్ఆన్ ఈ అంశాన్ని ఇలా వివరిస్తుంది: ఇండ్ల కప్పులు కూలి తలక్రిందులుగా పడివున్న పట్టణం మీదుగా పోయినవాడు “దీని చావు తరువాత అల్లాహ్ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు?” అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు అల్లాహ్ అతన్ని చంపి నూరేళ్ళవరకు మరణస్థితిలో ఉంచాడు. తరువాత అతన్ని లేపి, “ఈ స్థితిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు?” అని అడిగాడు. “మహా అయితే ఒకరోజు లేక ఒకరోజులో కొంత భాగం” అని అతను బదులిచ్చాడు. “లేదు నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడి ఉన్నావు. కాస్త నీ అన్నపానీయాల వైపు చూడు. అవి ఏ మాత్రం చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో. మేము నిన్ను ప్రజల కోసం ఒక నిదర్శనంగా చేయదలిచాము. మేము (గాడిద) ఎముకలను ఏ విధంగా లేపి, వాటిపై మాంసం నింపుతామో చూడు! ఇదంతా ప్రస్ఫుటమయి పోయాక, “అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని అన్నాడతను.[బఖరహ్:259].
వ్యాఖ్యానించండి