సంధి ద్వార ముస్లిముల చేతికి వచ్చే భూములు కేవలం దైవప్రవక్త[స.అ]కు మాత్రమే సంబంధించినవి, వాటిపై ఎవరికి ఎటువంటి హక్కు లేదు (నిదర్శనం హష్ర్ సూరహ్ 7వ ఆయత్).
హిజ్రీ యొక్క 7వ సంవత్సరంలో ముస్లిములు యూదులతో యుద్ధం చేసి “ఖైబర్” కోటను దక్కించుకున్నారు. దాంతో యూదుల కేంద్ర బలం తగ్గింది. ఫిదక్ లో ఉన్న యూదులు సంధికోసం దైవప్రవక్త[స.అ] వద్దకు వచ్చారు. వారు తమ భూమిలో సగభాగాన్ని ఉంచుకొని మిగత సగం భూమీ దైవప్రవక్త[స.అ]కు ఇచ్చేశారు. ఆ తరువాత వారు దైవప్రవక్త[స.అ] తో “వారి భూములను కూడా వాళ్ళకే కౌలుకు ఇవ్వమని” కోరారు. దైవప్రవక్త[స.అ] వారి ఒప్పందాన్ని అంగీకరించారు. యుద్ధం చేయకుండా సంధి ద్వార ముస్లిముల చేతికి వచ్చే భూములు కేవలం దైవప్రవక్త[స.అ]కు మాత్రమే సంబంధించినవి, వాటిపై ఎవరికి ఎటువంటి హక్కు లేదు(ఈ మాటకు నిదర్శనం ఖుర్ఆన్ యొక్క హష్ర్ సూరహ్ 7వ ఆయత్). ఫిదక్ కూడా ఆ విధంగానే ముస్లిముల చేతికి వచ్చిన భూమి. ప్రముఖ చరిత్రకారుడైన తబరీ తన గ్రంథం “తారీఖె తబరీ”లో “నిస్సందేహముగా ఫిదక్ దైవప్రవక్త[స.అ] యొక్క ఆస్తి; ఎందుకంటే ముస్లిములు దానిని సైన్యెం ద్వార తన సొంతం చేసుకోలేదు”[తారీఖె తబరీ, భాగం2, పేజీ302]. ఇస్రా సూరహ్ యొక్క 26వ ఆయత్ అవతరించడంతో దైవప్రవక్త[స.అ] తన కూతురిని పిలిచి ఫిదక్ భూమిని కానుకగా ఇచ్చేశారు.[మజ్ముఅల్ బయాన్, భాగం3, పేజీ411].
ఫిదక్ భూమిని దైవప్రవక్త[స.అ] తమ కుమార్తెకు ఇచ్చారు అన్న విషయాన్ని అహ్లె సున్నత్ ఉలమాలు తమ గ్రంథాలలో ఉల్లేఖించారు, ఉదా: అబూ సయీదే ఖుద్రీ, హాకిమె నైషాపూరీ మొ..
రిఫ్రెన్స్
తబరీ, తారీఖె తబరీ మరియు మజ్ముఅల్ బయాన్.
వ్యాఖ్యానించండి