కొన్ని దూఅ లను చదవటం గురించి పవిత్ర మాసూములు చాలా తాకీదు చేసి ఉన్నారు,అలాంటి దూఅ లలో నుండి "జియరతే ఆషూరా" ఒకటి.
జియరతే ఆషూరా మరియు దానికి గల ప్రాముఖ్యతను హదీసులలో చాలా చోట్ల వివరించడం జరిగింది ఈ క్రమంలో అయతుల్లహ్ దస్తఘైబ్ పుస్తకమైన "దాస్తాన్ హాయె షిగుఫ్త్" లో ఒక వర్ణనం దొరుకుతుంది:
వంద సంవత్సరాల క్రితం నజఫ్(ఇరాక్) ఉలమాలలో ఒకరు తన స్వప్నంలో ఇజ్రాఈల్(మ్రుత్యుదూత)ను చూసారు,సలాము జవాబు అయ్యిన తరువాత ఎక్కడి నుండి వస్తున్నావు? అని ప్రశ్నించారు,దానికి జవాబిస్తూ ఇజ్రాఈలు ఈ విధంగా అన్నారు:నేను షీరాజ్(ఇరాన్ లో ఒక నగరం పేరు) నుండి వస్తున్నాను అక్కడ మీర్జా ఇబ్రహీం మెహల్లాతి గారి ఆత్మను స్వాధీనం చేసుకోవటానికి వెళ్ళాను,ఆయన(మీర్జా ఇబ్రహీం) ఇప్పుడు ఏ పరిస్తితిలో ఉన్నారు అని ఆ మ్రుత్యుదూతో ప్రశ్నించారు,దానికి జవాబిస్తూ ఇజ్రాఈలు ఈ విధంగా అన్నారు:
వారు బర్జఖ్ లోని తోటలలో సేదతీరుతూ అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నారు,అల్లాహ్ ఆయన ఆజ్ఞా పాలనకు వెయ్యి మంది దూతలను నియమించాడు.మరలా ఆయన ఆ దేవదూతను ప్రశ్నిస్తూ ఈ విధంగా అన్నారు: వారు తన జ్ఞానం తన బోధన వలన లేదా తన శిష్యులకు మంచి శిక్షణ ఇవ్వటంవలన ఈ స్థానాన్ని సంపాదించారా? అని ప్రశ్నించారు. దానికి ఇజ్రాఈల్ కాదు అని సమాధానమిచ్చారు,మరలా ప్రశ్నిస్తూ:మరి జమా'అత్ నమాజు లేదా అహ్కాం లను భోదించడం వలన ఆయనకు ఈ స్థానం లభించిందా? అన్నారు,దాని వలన కూడా కాదు అని ఇజ్రాఈలు అన్నారు,మరి ఏ కారణంగా ఆయన ఈ సుఖాలను పొందారు? అని ప్రశ్నించారు,దానికి సమాధానంగా ఇజ్రాఈలు "ఆయన ఈ ప్రతి ఫలాన్ని జియరతే ఆషూరాను చదవటం వలన పొందరు" అని అన్నారు.
మీర్జా ఇబ్రహీం ఈ జియరత్ ను తన జీవితపు ఆఖరి ముప్పై సంవత్సరాలలో నిరంతరం చదివేవారు,ఒక వేళ అనారోగ్యం లేదా వేరే కారణంగా చదవలేకపోతే ఒక సహయకుడిని నియమించి అతని ద్వారా చదివించేవారు.
రెఫరెన్స్
దాస్తాన్ హాయె షిగుఫ్త్ అంగీజ్,110వ హికాయత్.
వ్యాఖ్యలు
Mashaallah
Mashaallah
Mashallah
వ్యాఖ్యానించండి