ఏదో లాభాన్ని ఆశించి ఆ అల్లాహ్ మనల్ని నమాజు చేయమని ఆజ్ఞాపించలేదు,కేవలం మన ప్రయోజానాల కొరకే నమాజును విధిగా చేయటం జరిగింది.
నమాజు చేయడం మనపై విధిగా ఎందుకు చేయబడింది?మనము నమాజు చేయటం వలన అల్లాహ్ కు ఏం లాభం కలుగుతుంది?ఆ అల్లహ్ కు మనల్ని నమాజు చేయమని ఆదేశించటానికి ఏదైన కారణం ఉందా? అనే ప్రశ్నలు చాలా కలుగుతాయి,దానికి జవాబు దివ్యఖురానులోనే దొరుకుతుంది.
సమస్యలను విన్నవించుకునే మార్గం: ఈ లోకంలో ఎన్నో సమస్యలతో సతమతమయ్యే ఈ మానవునికి ఎవరితోనైనా తన సమస్యలను చెప్పుకోవాలని ఉంటుంది ఆ సమస్యలను విన్నవించుకోవటానికి ఆ భగవంతుడి కన్నా ఉత్తములు మరియు నమాజు కన్నా మంచి మార్గం ఎముంటుంది?
ఆ అల్లాహ్ దివ్యఖురానులో ఈ విధంగా సెలవిస్తున్నాడు: “మరి మీ ప్రభువు ఏమంటునాడంటే,మీరు నన్నే ప్రార్ధించండి.నేను మీ ప్రార్ధనలను ఆమోదిస్తాను”[అల్ ఘాఫిర్/60].
నమాజు ద్వారానే తృప్తి కలుగుతుంది: మనశ్శాంతి కరువైన ఈ లోకంలో కేవలం ఆ దేవుని స్మరణ ద్వారానే తృప్తి మరియు మనశ్శాంతి సాధ్యం,దైవఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: “విశ్వసించిన వారి హృదయాలు అల్లాహ్ స్మరణ ద్వారా తృప్తి చెందుతాయి.తెలుసుకోండి!అల్లాహ్ స్మరణ ద్వారానే హృదయాలు నెమ్మదిస్తాయి”[అల్ రాద్/28].
అల్లాహ్ కు మీ నమాజుల అవసరం లేదు: ఈ లోకమంతా కలిసి ఆ భవంతునిని ప్రార్ధించినా? ప్రార్దించక పోయినా? అతనికి ఒరిగేదేమీ లేదు,ఖురాను ఈ విధంగా సంభోదిస్తుంది: “ఓ ప్రజలారా! మీరంతా అల్లాహ్ అవసరం కలిగినవారు.అల్లాహ్ మాత్రం అక్కరలేనివాడు,(సర్వవిధాలా) స్తుతించదగినవాడు”[ఫాతిర్/15].
వ్యాఖ్యానించండి