జనాబె సల్మానె ముహమ్మదీ యొక్క మరణం మరియు వారి సమాధి ఎక్కడ ఉంది అన్న విషయం పై సంక్షిప్త వివరణ.
జనాబె సల్మాన్, ఉస్మాన్ ఖిలాఫత్ అధికారంలో హిజ్రీ యొక్క 35వ సంవత్సరంలో మరణించారు.[బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ391-392] ఇమామ్ అలీ[అ.స] వారి మృతదేహాన్ని గుస్ల్ స్నానం చేయించి, కఫన్ బట్టలు వేసి అతనిపై జనాజహ్ నమాజ్ ను చదివారు. ఇమామ్ తో పాటు జాఫరె తయ్యార్ మరియు హజ్రతె ఖిజ్ర్ ఉన్నారు వారిద్దిలో ప్రతీ ఒక్కరితో పాటు దైవదూతల 70 వరుసలు సల్మాన్ పై జనాజహ్ నమాజ్ ను చదివారు.[బిహారుల్ అన్వార్, భాగం22, పేజీ373] వారి సమాధి మదాయిన్ లో ఉంది.
కనిపిస్తున్న ఈ రంగు రంగుల ప్రపంచం మనిషిని పాపముల సముద్రంలో ముంచేస్తుంది, అల్లాహ్ నుంచి దూరం చేస్తుంది, ఆయన పంపించిన నిజమైన మార్గదర్శకుల పట్ల అవిధేయులుగా నిలబెడుతుంది. కాని ఎవరైనా తన ఆత్మను సద్గుణాల ద్వార తమ అస్తిత్వాన్ని నౌక మార్చుకుంటే ఈ పాపముల సముద్రం నుండి బయటపడి పరిపూర్ణ స్థాయికి చేరుకోవచ్చు. దీనికి జనాబె సల్మన్ యొక్క జీవితమే నిదర్శనం.
రిఫ్రన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్.
వ్యాఖ్యానించండి