ఆ భగవంతుడు మానవుడిని స్వాతంత్రునిగా పుట్టించాడు కానీ మానవుడు తను తీసుకునే కొన్ని నిర్ణయాలే రాబోయే కాలంలో అతని జీవితాన్ని నిర్ణయిస్తాయి, ఎలాంటి పనులైతే అతనిని భవిష్యత్తులో బాధపడేలా చేస్తాయో అలాంటి కార్యాలకు దూరంగా ఉంటే మంచిది.
ప్రళయదినాన్ని బాధపడేరోజు లేదా చింతించే రోజు అని కూడా అంటారు ఎందుకంటే ఆ రోజున మానవుడు చింతించటం తప్ప ఏమీ చేయనూ లేడు. ఆ రోజుకు గల కొన్ని లక్షణాలను దివ్యఖురానులో ప్రస్థావించటం జరిగింది.
1. బాధపడే రోజు గురించి హెచ్చరిక: “వ్యవహారం తేల్చబడి వారు బాధపడేరోజు గురించి (ఓ మొహమ్మద్[స.అ]!) వారిని హెచ్చరించండి (ఏమైనా) వారు పరధ్యానానికి గురై ఉన్నారు. వారు విశ్వసించే రకం కాదు”[మర్యం/39].
2. పరిహాసమాడేవారు బాధపడే రోజు: “(అలాంటి) దాసుల పరిస్థితి కడు శోచనీయం! తమ వద్దకు ఎప్పుడు, నీ ప్రవక్త వచ్చినా వారతన్ని పరిహాసించకుండా ఉండలేదు”[యా సీన్/30].
3. అవిశ్వాసులు చింతించే రోజు:నిస్చయంగా ఇది (ఈ దిక్కారవైఖరి) అవిశ్వాసులను బాధపడేలా చేస్తుంది[అల్ హాఖ్ఖహ్/50].
4. ప్రళయదినం, చెసిన లోటు గురించి చింతించే దినం: అప్పుడు ఏ ప్రాణి అయినా, అయ్యో! ఏమి దురవస్త నాది! నేను అల్లాహ్ విషయంలో లోటు చేశానే! నేను గేలి చేసే వారిలో ఉండిపోయానే!? అని చెబుతుందేమో!(ఆ పరిస్థితి రాకూడదు సుమా!)[అజ్ జుమర్/56].
5. చేసిన కార్యాల గురించి బాధపడే రోజు: అప్పుడు (కనువిప్పుకలిగిన) కలిగిన అనుచరులు ఇలా అంటారు: “మేమే గనక మరోసారి ప్రాపంచిక జీవితం వైపుకు మరలించ బడటమంటూ జరిగితే వీరు(ఈ అయ్యవార్లు) మా పట్ల ఇక్కడ విసుగును ప్రదర్శించినట్లే మేమూ వీరి పట్ల విసుగును ప్రదర్శించే వారం”. ఈ విధంగా వారు సిగ్గుతో కుంచించుకుపోయే విధంగా అల్లాహ్ వారి కర్మలను వారికి చూపిస్తాడు. అయినా సరే వారు నరకం నుంచి బయట పడటమన్నది అసంభవం[అల్ బఖర/167].
వ్యాఖ్యానించండి