మనిషి ఈ సమస్త సృష్టికి మూలకారణమైన ఆ భగవంతునిని ఆయన కృపను గ్రహించక పోతే ఈ జీవితానికి సార్ధకత ఏమున్నది?
మానవునికి ధర్మం లేదా మతము యొక్క అవసరం ఉన్నదా?ఈ ధర్మము లేక పోతే బ్రతక లేడా? అన్న సందేహం అందరికి కలిగేదే,ఈ ప్రశ్నకు జవాబిచ్చే ముందు మనము మానవుని అవసరాల గురించి తెలుసుకోవటం చాల అవసరం.మానవుని ప్రాధమిక అవసరాలను మూడు భాగాలుగా విభజించవచ్చు:
1. వ్యక్తిగత అవసరాలు,అంటే జీవించటానికి కావలసిన ఆహారం,ధరించటానికి సరిపడా వస్త్రాలు,ఉండటానికి ఇల్లు,తోడుగా ఉండటానికి భార్య ఇలాంటివి ఎన్నో అవసరం,వీటిని మానవుని వ్యక్తిగత అవసరాలుగా చెప్పవచ్చు.
2. సామాజిక అవసరాలు,అంటే ఒక సమాజంలో నివసించటానికి కావలసిన ప్రాధమిక అవసరాలు అంటే సమాజాన్ని నడిపే నాయకుడు, సమాజాన్ని నడపటానికి అవసరమైన చట్టాలు,నిబంధనలు లాంటివి వీటిని మానవుని సామాజిక అవసరాలుగా చెప్పవచ్చు.
3. ఉన్నతమైన అవసరాలు,ఈ సమస్త సృష్టిలో చలించే మరియు చలించని జీవరాసుల యొక్క జ్ఞానం మరియు వాటి సృష్టికర్తను మరియు అతని మహిమ,చతురతను అర్ధం చేసుకోవటానికి సరిపడా జ్ఞానం ,ఈ లోకం యొక్క సృష్టి మరియు దాని సృష్టిలో దాగి ఉన్న భగవంతుని ఉద్దేశం మరియు ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకొని ధర్మబధ్ధంగా జీవించటానికి సరిపడా జ్ఞానం, అన్ని విద్యలకు మూలమైన ఈ విద్యను ఉన్నతమైన విద్య లేదా బ్రహ్మవిద్య అని కూడా చెప్పవచ్చు. ఈ జ్ఞానం చాలా అవసరం ఎందుకంటే సమస్త జీవరాసులకు సృష్టికర్త అయిన ఆ భగవంతునిని ఆయన కృపను గ్రహించకపోతే జీవితానికి అర్ధం ఉండదు.
పై రెండు అవసరాలను తీర్చుకునే సామర్ధత మానవునికి ఉంది ఎందుకంటే మానవునికి ఈ లోకం పట్ల దానికి అవసరమైన వ్యక్తిగత మరియు ప్రాధమిక అవసరాల పట్ల జ్ఞానం ఉంది,కానీ అతనికి దాని సృష్టికర్త మరియు ఎక్కడ నుంచి వచ్చాను? ఎక్కడికి వెళ్ళాలి? ఈ లోకంలో ఎలా బ్రతికితే పరలోకంలో సుఖశాంతులతో జీవించవచ్చు అనే ప్రశ్నల పట్ల జ్ఞానం లేదు.ఈ జ్ఞానం మానవుని వద్ద లేదు కేవలం ఆ భగవంతుని వద్ద లేదా ఆయన ప్రవక్తల వద్ద లేదా వారి ఉత్తరాధికారుల వద్దే ఉంది(అది కూడా ఆ భగవంతుడు వారికి ప్రసాదించినదే).భగవంతుడు ఈ ప్రశ్నలన్నిటి సమాధానం కోసమే ఒక ధర్మాన్ని తన ప్రవక్తల ద్వారా పంపటం జరిగింది తద్వారా ఈ మానవుడు బ్రహ్మధర్మ నియమావళిని ఆచరించి పరలోక ప్రాప్తిని పొందగలడు.
రెఫరెన్స్: ఉసూలే అఖాయదె ఇస్లామి,నియాజ్ బె దీన్,ఆగాయె మొహ్సిన్ ఖిరా'అతి.
వ్యాఖ్యానించండి