ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] అతిథులను ఎలా విందు ఏర్పాటు చేసేవారు, మరియు వారికి ఇవ్వబడిన సలహా, దానికి ఇమామ్ సమాధానం.
ఇలా ఉల్లేఖించబడి ఉంది: ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] వద్దకు వచ్చివెళ్ళే అతిథుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. ఇమామ్ అతిథులకు ఒక్కోసారి మంచి మంచి విందులను ఎర్పాటు చేస్తే ఒక్కోసారి వట్టి రొట్టె మరియు జైతూన్ పండ్లతో విందును ఏర్పాటు చేసేవారు.
ఒక వ్యక్తి ఇమామ్ వద్దక వచ్చి ఇలా అన్నాడు: “అయ్యా! మీరు యుక్తితో అమలు చేస్తే మీరు మీ అతిథులందరికీ సమానంగా విందును ఏర్పాటు చేయవచ్చు”
ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: వ్యవహారతంత్రములు మా వద్ద లేవు, అవి కేవలం అల్లాహ్ వద్ద ఉన్నాయి, మేము కేవలం ఆయన ఆజ్ఞపై శిరసు వంచుతాము. అల్లాహ్ ఎక్కవుగా ప్రసాదించినప్పుడు మేము కూడా అతిథులకు మంచి మంచి ఆహారపదార్ధాలతో విందును ఏర్పాటు చేస్తాము మరియు అల్లాహ్ మనకు తక్కువగా ప్రసాదించినప్పుడు మేము కూడా మన అతిథులకు సాధారణ విందులను ఏర్పాటు చేస్తాము.[మహజతుల్ బైజా, భాగం3, పజీ43]
రిఫ్రెన్స్
సద్ మౌజూ పూన్సద్ దాస్తాన్, భాగం1, తస్లీమ్ అధ్యాయం.
వ్యాఖ్యానించండి