చేతిలో అధికారం ఉన్నా ప్రజానికాన్ని అదుపులో పెట్టుకోవటం కష్టం కానీ ప్రజలపై తన ప్రభావాన్ని చూపించటానికి ఇమాం కాజిం(అ.స) ల వారు ఎంచుకున్న మార్గం దీనికి విభిన్నం.
ఇమాం మూసా కాజిం(అ.స)ల వారి వద్ద ఆయుధాలు లేవు మరియు రాజ్యాధికారము లేదు మరియు ఎటువంటి ప్రచార సదుపాయాలు లేవు కానీ ప్రజలపై వారికి అపారమైన ఆధ్యాత్మియ ప్రభావం ఉండేది.ఎంతంటే ఖలీఫా ఐన హారూన్ యొక్క అత్యంత సన్నిహిత వ్యక్తులు ఇమాం(అ.స) ల వారి అనుచరులు.వారిలో హారూన్ రాజ్యానికి మంత్రియైన అలి బిన్ యఖ్తీన్ ఒకరు.అతను రహస్యంగా ఇమాం కాజిం(అ.స)ల వారి సూచనల అనుసారంగా పనిచేసేవారు. ఇలాగే ఎంతో మంది అనుచరులు ఇమాం(అ.స)ల వారి వ్యక్తిత్వానికి ఆకర్షింపబడిన వారే,కానీ వారు ఆ ఖలీఫాల భయంతో ఎప్పుడూ ఇమాం(అ.స)ల వారిని కలవడానికి ధైర్యం చేయలేదు. ఇమాం కాజిం(అ.స)ల వారు ఆ నాటి దుష్ట పాలకుల గురించి ఈ విధంగా సెలవిచ్చారు: “వారి మంచి కోరే ప్రతీ ఒక్కరు వాళ్ళ మాదిరే మరియు వారు వాళ్ళతో(ఖలీఫాలతో) పాటు నరకాగ్నిలోకి ప్రవేసిస్తారు”. ఈ విధంగా ఇమాం(అ.స)ల వారు ఆ నాటి ఖలీఫాలపై తన కోపాన్ని,అసంతృప్తిని తెలియజేసేవారు.ఆ ఖలీఫాలను సహకరించటాన్ని మరియు వారిపై ఆధారపడటాన్ని ఆపేవారు. వేరే చోట వారి గురించి ఈ విధంగా సెలవిచ్చారు: “ఈ దౌర్జన్యపరులపై ఆధారపడకండి (వారిపై ఆధారపడితే) మీరు కూడా నరకంలోకి ప్రవేసించక తప్పదు”. ప్రజలకు మతసంభందమైన,వారి విశ్వాసాలకు సంబంధించిన ప్రశ్నలకు జవాబివ్వటం మరియు వారికి ఎహ్కాములను బోధించటం మరియు ఎన్నొ రకాల మత సంబంధమైన వర్గాల,శాఖల మరియు వారి తప్పుడు ప్రచారలపై పోరాటం ఇలా ఎన్నొ విధాలుగా ఇమాం(అ.స)ల వారు తన కర్తవ్యాలను నెరవేర్చటం జరిగింది.
రెఫరెన్స్: జిందగినామయె ఇమాం మూసా కాజిం(అ.స).
వ్యాఖ్యలు
Mashallah
వ్యాఖ్యానించండి