ఖురాన్ పఠనం పై తాకీదు చేస్తున్న దైవప్రవక్త(స.అ.వ)ల వారి కొన్ని హదీసులను ఇచట వివరించటం జరిగింది.
1.ఏ ఇంట్లో అయితే దివ్యఖురాను పఠనం ఎక్కువగా జరుగుతుందో ఆ ఇంట్లో మేలు ఎక్కువగానే జరుగుతుంది మరియు ఆ కలిగే మేలు ఆ ఇంటి వారిపై విస్తరింపబడుతుంది(పెరుగుతుంది).(ఏ విధంగా పెరుగుతుందంటే) ఆ ఇల్లు ఆకాసవాసులకు(దాని నుండి వచ్చే తేజస్సు వలన) మెరుస్తూ కనపడుతుంది ఏ విధంగా నైతే ఆకాసపు తారలు ఈ భూమివాసులకు మెరుస్తూ కనపడతాయో ఆ విధంగా.
2.మీలో ఎవరైతే ఖురాను నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తారో వారే ఉత్తములు.
3.ఓ నా కుమారుడా!ఖురాను పఠనం పట్ల నిర్లక్ష్యం వహించకు ఎందుకంటే అది(ఖురాను) నిర్లక్ష్యం వలన చనిపోయిన హ్రుదయాలకు మరలా ప్రాణాన్ని పోస్తుంది మరియు సిగ్గుమాలినతనం నుంచి,చెడు విషయాల నుంచి ఆపుతుంది.
4.అత్యంత నిజమైన వచనం,అత్యంత స్పష్టమైన హితబోధ మరియు అందమైన కధనాలు అల్లే (ఏకైక గ్రంధం) ఆ దేవుని గ్రంధం(దివ్యఖురాను).
5.ఎవరైతే దైవప్రసన్నతను చూరగొనటానికి మరియు బ్రహ్మధర్మం పట్ల అవగాహన కొరకు ఖురానును నేర్చుకుంటారో వారికి లభించే ప్రతిఫలం ఆ దైవదూతలకు,దైవప్రవక్తలకు మరియు మార్గదర్శకులకు లభించే ప్రతిఫలానికి సమానం.
రెఫరెన్స్: అల్ కాఫి,2వ భాగం,పేజీ నం:610,నెహ్జుల్ ఫసాహ,పేజీ నం:473,అల్ బుర్హాన్ ఫీ తఫ్సీరిల్ ఖుర్ ఆన్,1వ భాగం,పేజీ నం:19,మన్ లా యహ్జురుహుల్ ఫఖీహ్,4వ భాగం,పేజీ నం:402,వసాయెలుష్ షియ,6వ భాగం,పేజీ నం:184.
వ్యాఖ్యలు
Masha Allah
Shukriya.. Jazakallah..
వ్యాఖ్యానించండి