ఈ రోజు సమాజంలో చెడు మరియు సిగ్గుమాలినతనం పెరిగిపోవటానికి కారణం ఆ సమాజపు వాళ్ళు" అమ్ర్ బిల్ మారూఫ్ మరియు నహి అనిల్ మున్ కర్" పట్ల నిర్లక్ష్యం వహించటమే.
"అమ్ర్ బిల్ మారూఫ్" అనగా మంచిని గురించి ఆజ్ఞాపించటం మరియు "నహి అనిల్ మున్ కర్" అంటే ఇతరులను చెడు నుంచి వారించటం. ఇవి సమాజానికి వెన్నెముక లాంటివి ఎప్పుడైతే సమాజంలో ఒకరినొకరు మంచిని గురించి ఆజ్ఞాపించి ఇతరులను చెడు నుంచి ఆపుతారో వారే దివ్యఖురాను ద్రుష్టిలో నిజమైన విశ్వాసులు.దైవవాణిలో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: “విశ్వాసులైన పురుషులూ,విస్వాసులైన స్త్రీలూ, వారంతా ఒండొకరికి మిత్రులుగా(సహయకులుగా, చేదోడువాదోడుగా) ఉంటారు.వారు మంచిని గురించి ఆజ్ఞాపిస్తారు.చెడులు గురించి వారిస్తారు. నమాజులను నెలకొల్పుతారు, జకాత్ ను చెల్లిస్తారు.అల్లాహ్ కు ఆయన ప్రవక్తకు విధేయులై ఉంటారు.అల్లాహ్ అతి త్వరలో తన కారుణ్యాన్ని కురిపించేది వీరిపైనే.నీస్సందేహంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేచనాశీలి”[తౌబా/71]. ఒక సమాజం నెలకొనేది ప్రజలతోనే వారిలో ఏ ఒక్కరు తప్పు చేసినా దాని ప్రభావం మొత్తం సమాజంపై పడుతుంది.ఒక సమాజం యొక్క తలరాత మార్చేది ఒక వ్యక్తే,ఆ సమాజాన్ని తలదించుకునేలా చేసేది కూడా ఒక వ్యక్తే. ఒక హానికారక వ్యాది వచ్చినప్పుడు దానిని మొదటిదశలోనే చికిత్స చేయటం అవసరం. ఒకవేళ అలా చేయకపోతే మొత్తం సమాజం ఆ వ్యాది బారిన పడుతుంది.అలాగే ఒక సమాజంలో ఎప్పుడైతే అది చెడిపోతుందని తెలిసినప్పుడు దానిని(చెడును) మొదటి దశలోనే అంతమొందించటం చాల అవసరం. అది “అమ్ర్ బిల్ మరూఫ్ మరియు నహి అనిల్ మున్ కర్”ల తోనే సాధ్యం. ఇది సమాజంలో ఉండే ప్రతీ వ్యక్తి యొక్క కర్తవ్యం, దైవఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: “మేలు వైపుకు పిలిచే, మంచిని చేయమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు”[ఆలి ఇమ్రాన్/104].
వ్యాఖ్యానించండి