తన సృష్టికర్తను అతని కృపను గ్రహించలేని మానవుడు ఈ భూమిపై కేవలం ఒక భారంగానే మిగిలి పోతాడు తప్ప అతని వలన మానవజాతికి ఏ ఉపయోగం లేదు.
సమస్త సృష్టిలో అత్యంత భిన్నమైన మరియు విలువైన సృష్టి మానవుడి సృష్టి. మనిషిని సృష్టించి అల్లాహ్ తనను తాను ఉత్తమ సృష్టికర్తగా మరియు శుభకరునిగా వ్యక్తం చేశాడు. ఈ విధంగా మానవుని విలువేమిటో అర్ధం చేసుకోవచ్చు. మానవుని విలువను అతని ప్రతిష్టతను ప్రస్థావిస్తూ దివ్యఖురాను ఈ విధంగా సెలవిస్తుంది: "ఆయనే తన ఆజ్ఞతో సముద్రనౌకలను నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీనదాలను మీ అధీనంలో ఉంచాడు. ఆయనే నిరంతరప్రయాణం చేస్తూ పోతున్న సూర్యచంద్రులను మీకు లోబరచాడు. రేయింబవళ్ళు కూడా ఆయన మీ సేవకై కట్టుబడి ఉండేలా చేసాడు"[ఇబ్రాహీం/32,33].
కానీ అదే మానవుడు తన విలువను కొద్దిపాటి డబ్బుకోసం, ఎప్పటికైనా నాశనమవ్వాల్సిన ఒక ఇల్లు కోసం, ఎప్పటికీ శాస్వతం కాని ఒక చిన్న అధికారం కోసం తన మానవత్వాన్ని దాని విలువలను ఈ లోకపు బాజారులో అమ్ముకుంటున్నాడంటే ఎంతకి దిగజారిపోయాడో అర్ధమవుతుంది. ఐశ్వర్యవంతుడు, తెలివైనవాడు, చదువుకున్నవాడు కానీ అన్ని ఉన్నా అల్లాహ్ పై విశ్వాసం లేదు, సృష్టికర్తను గ్రహించని విద్య కూడా ఒక విద్యేనా!? దేవుని మార్గంలో పనికిరాని ఐశ్వర్యం కూడా ఒక ఐశ్వర్యమేనా!? ధనంపై, లోకంపై, భార్యాపిల్లలు మరియు ఇతర బంధాలపై వ్యామోహం లేకుండా అల్లాహ్ ను మరియు ఆయన కృపను గ్రహించి తన కర్తవ్యాలను నెరవేరుస్తూ ధర్మబధ్ధంగా బ్రతికిన నాడే ఈ మానవుడు తన విలువలను తెలుసుకున్నవాడవుతాడు.
వ్యాఖ్యానించండి