సర్వాధికారి అయిన అల్లాహ్ ఏ విధంగా ఆహంకారియైన ఒక బలవంతునికి గుణపాఠం చెప్పాడో తెలిపే సంఘటన.
ఒక బలవంతుడైన పహిల్వాను ప్రపంచానికి తనకు తెలిసిన కళలన్ని చూపించి,ప్రపంచంలోని బలవంతులను ఓడించి చాలా ఖ్యాతిని పొందాడు.ఆ తరువాత అహంకారంతో ఆకాసం వైపు చూస్తూ "ఓ భగవంతుడా!నాతో తలపడటానికి జిబ్రయీలును[దేవదూతను] పంపించు,ఎందుకంటే నన్ను ఎదురించేవారు ఈ భూమిపై ఎవరూ లేరు" అని అన్నాడు.ఎన్నో రోజులు గడవలేదు,సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతనిని బలహీనంగా చేసి అతని అహంకారాన్ని నాశనం చేసాడు.ఆ తరువాత అతడిని పాడుపడ్డ ప్రదేశానికి చేరుకునెలా చేసాడు.అక్కడ అతడు ఎంత బలహీనుడైపోయాడంటే తన తలను ఒక ఇటుకపై ఉంచి పడుకున్నప్పుడు ఒక ఎలుక వచ్చి అతని కాలి వేలును కొరుకుతుంటే అతడు తన కాలును ఎత్తే పరిస్థితిలో కూడా లేడు. అటువైపు వెళ్తూ ఈ విషయాన్ని గమనించిన ఒక వ్యక్తి ఆ పహిల్వానుతో "అల్లాహ్ తన సైన్యాలలో అత్యంత చిన్నదైన సైన్యంలోని ఒక సైనికుడిని నీ వద్దకు పంపాడు,ఎందుకంటే అల్లాహ్ నిన్ను నీ అహంకారం నుండి మేల్కొలిపి అతని సన్నిధిలో పశ్చాతాపాన్ని కోరుకోవాలని ఈ విధంగా చేసాడు,నీవు క్షమాపణను కోరుకున్న యెడల అల్లాహ్ శహనశీలి మరియు లజ్జగలవాడు కాబట్టి నిన్ను తప్పక క్షమిస్తాడు" అని అన్నాడు.
రెఫరెన్స్: ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్,పేజీ నం: 387.
వ్యాఖ్యానించండి