ఒక గుహలో ఇరుక్కుపోయిన ముగ్గురి వ్యక్తుల కథనం రివాయత్ అనుసారం.
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: బనీ ఇస్రాయీల్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తుండగా దారి మధ్యలో మబ్బులు కమ్ముకొని వర్షం మొదలయ్యింది. వర్షానికి తడవకుండా దగ్గరలో ఉన్న గుహలోకి వెళ్ళారు. అకశ్మాత్తుగా కొండ మీద నుండి ఒక పెద్దరాయి వచ్చి ఆ గుహ ద్వారాన్ని మూసేసింది. లోపల చీకటి కమ్ముకుంది ఇక అల్లాహ్ తప్ప మరొకరి సహాయం వారికి దక్కదు అని గ్రహించి వారిలో ఒకడు ఈ ఆపద నుండి బయటపడాలంటే కేవలం మేము చేసుకున్న స్వచ్ఛమైన కార్యాల ఆధారంగా అల్లాహ్ ను వేడుకోవడమే, దాంతో మనం ఈ ఆపదనుండి బయటపడవచ్చు. వారిలో ఒకడు ఇలా అన్నాడు:
“ఓ అల్లాహ్! నీకు బాగా తెలుసు, నా పినతండ్రి కూతురు, చూడడానికి చాలా అందంగా ఉండేది, నేను దానిని ఇష్టపడేవాడిని. ఒకరోజు నేను నా కోరికను నెరవేర్చుకోవాలనే ఆశతో దాని చేయి పట్టుకున్నాను. అది నాతో “అల్లాహ్ కు భయపడు, నా మానాన్ని నాశనం చేయకు” అని అంది. దాని ఆ మాట ప్రభావం నాపై పడింది మరి నేను పాపము చేయలేదు. ఒకవేళ నేను ఈ పని స్వచ్ఛంగా మరియు నీ కోసం గనక చేసి ఉంటే ఈ ఆపద నుండి మమ్మల్ని కాపాడు” వారు అకశ్మాత్తుగా ఆ గుహ ద్వారం నుండి కొద్దిగా రాయి జరిగి లోపలికి వెలుతురు రావడాన్ని చూశారు.
వారిలో రెండవ వాడు ఇలా అన్నాడు: “ఓ అల్లాహ్! నీకు తెలుసు నా తల్లిదండ్రులు వృద్ధులు. ఒకరోజు రాత్రి నేను వారి కోసం అన్నం తీసుకొని వెళ్ళాను, వారిద్దరూ పడుకుంటున్నారు. రాత్రంతా నేను ఆ అన్నం తీసుకొని నిలబడే ఉన్నాను కాని వారికి కష్టం కలగకూడదని వారిని నిద్ర నుండి లేపలేదు. ప్రభూ! నేను ఈ పని స్వచ్ఛంగా మరియు నీ అంగీకారం కోసం చేసినట్లైతే నీవు మమ్మల్ని కనికరించి ఈ మూసి ఉన్న ద్వారాన్ని మా కోసం తెరూ” ఇలా కోరగానే ఆ రాయి ఇంకొంచెం జరిగింది, ఇక ఇప్పుడు ఇంకొంచెం వెలుతురు వచ్చింది.
మూడవ వాడు ఇలా వేడుకున్నాడు: “ప్రతీ గుప్త మరియు వ్యక్త విషయాల జ్ఞానం కలిగి ఉన్నవాడా! నీకు తెలుసు ఒక వ్యక్తి నా వద్దకు పని చేయడానికి వచ్చాడు. పని పూర్తవ్వగానే నేను అతడి కూలీ డబ్బులు అతడికి ఇచ్చేవాడిని. కాని ఒకరోజు నేను అతడికి ఆ రోజు కూలీ ఇస్తే అతడు తీసుకోలేదు, ఎందుకంటే అతడికి ఎక్కువ కూలీ డబ్బులు కావాలి. అతడు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. నేను అతడి ఆ కూలీ డబ్బులతో ఒక గొర్రెను కొని దానిని పెంచాను, ఆ గొర్రెకు పిల్లలు పుట్టారు, అలా అలా కొంత కాలం తరువాత గొర్రెల మంద ఏర్పడింది. చాలా కాలం తరువాత ఆ పనివాడు నా వద్దకు వచ్చి తన కూలీ డబ్బులు కావాలీ అని అడిగాడు, నేను ఆ గొర్రెల మందను చూపించాను. అతడు నేను ఎగతాళి చేస్తున్నాను అని అనుకున్నాడు. నేను జరిగిన విషయాన్ని వివరించాను. అతడు ఆ గొర్రెల మందను తీసుకున్నాడు. ప్రభూ! ఒకవేళ నేను ఈ పనిని స్వచ్ఛంగా మరియు నీ స్వీకరణ కోసం గనక చేసి ఉంటే మమ్మల్ని ఈ ఆపద నుండి విముక్తిని ప్రసాదించు” అప్పుడు ఆ రాయి పూర్తిగా జరిగిపోయింది. మరియు ఆ ముగ్గురు సంతోషంగా ఆ గుహ నుండి బయటకు వచ్చారు.[మహాసినె బర్ఖీ, భాగం2, పేజీ253]
రిఫ్రెన్స్
సద్ మౌజూ పూన్సద్ దాస్తాన్, భాగం1, ఇఖ్లాస్ అధ్యాయం.
వ్యాఖ్యానించండి