ఆరు సమూహాలు శాపగ్రస్తులు అని వివరిస్తున్న దైవప్రవక్త[స.అ] రివాయత్ ఉల్లేఖనం.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స], తమ పితామహుల ద్వార ఇలా ఉల్లేఖించారు; దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించారు: ఆరు సమూహాల పై అల్లాహ్ మరియు ప్రముఖ ప్రవక్తల లఅనత్(శాపం) ఉంది;
1. అల్లాహ్ గ్రంథంలో ఏదైన పెంచేవారి పై
2. అల్లాహ్ ఖజా వ ఖదర్(దైవనియోగము)ను ధిక్కరించేవారి పై
3. నా సున్నత్ ను విడిచిన వారి పై
4. నా అహ్లెబైత్[అ.స]లకు అల్లాహ్ ప్రసాదించిన గౌరవాన్ని తగ్గించాలని చూసేవారి పై
5. అల్లాహ్, గౌరవనీయులుగా నిర్ధారించిన వారిని కించపరచడానికై మరియు అల్లాహ్ అగౌరవులుగా నిర్ధారించిన వారిని గౌరవనీయులుగా నిర్ధారించడానికై అన్యాయంగా అధికారాన్ని చేజిక్కించుకన్నవారి పై
6. ముస్లిములకు చెందిన బైతుల్ మాల్(ఇస్లామీయ భాండాగారము)ను తమ కోసం నిశ్చయించుకొని దానిని తమపై హలాల్గా భావించేవారి పై.[ఖిసాల్, భాగం1, పేజీ493].
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, ఖిసాల్, తర్జుమా జాఫరీ, నసీమె కౌసర్, ఖుమ్, 1382.
వ్యాఖ్యానించండి