కష్టాలైన,సుఖాలైనా,అన్ని సందర్భాలలో ధర్మానికి అండగా ఉండేవారే నిజమైన ధార్మికులు.
ఇమాం హుసైన్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “నిశ్చయంగా ప్రజలు లొకం యొక్క బానిసలు.మరియు ధర్మము కేవలం వారి నోటి వరకే పరిమితము.ఎప్పటివరకైతే వారి జీవితం సాఫీగా సాగుతుందో వారు ధర్మాన్ని అనుసరిస్తారు,ఎప్పుడైతే వారిపై ఆపదలు వస్తాయో [నిజమైన] ధార్మికులు తగ్గిపోతారు” [బిహారుల్ అన్వార్,44వ భాగము,పేజీ నం:383].
ఆపదలు మరియు కష్టాలనేవి మానవ జీవితంలో సహజమే,ఒక్కోసారి ఈ కష్టాలు విశ్వాసులను పరీక్షిస్తాయి. కష్ట సమయంలో కూడా నిజంగా ఆ దేవునిపై మరియు ఆ దేవుని ధర్మంపై వారి విశ్వాసము ఎంతున్నదో కూడా తెలుస్తుంది.నిజమైన విశ్వాసులు ఆ దైవమార్గంలో కష్టాలను ఇష్టపడతారు కూడా.తద్వారా వారు తమ ఆత్మను శుద్ధి చేసుకుని ఆ దేవుని మార్గంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు.వేరే వైపు చూస్తే కొంత మంది తమను తాము నిజమైన విశ్వాసులుగా చూపిస్తారు కానీ వారి హృదయంలో దేవుని పట్ల మరియు ధర్మము పట్ల కొద్దిపాటి ప్రేమ కూడా ఉండదు.మరియు దైవమార్గంలో కష్టాలను వారు నిజంగానే సంకటాలుగా భావిస్తారు.ఈ లక్షణమే వారిని విశ్వాసపు వలయం నుండి బయటకు తీసుకుపోతుంది.
వ్యాఖ్యానించండి