షైతాను మరియు హజ్రత్ యహ్యా[అ.స] ల వారి మధ్య జరిగిన సంభాషణ ఇమాం సాదిఖ్[అ.స] ల వారి నోట.
ఇమాం సాదిఖ్ [అ.స] ల వారు ఒక రోజు తన అనుచరులలో ఒకరైన హఫస్ ఇబ్నె గియాస్ తో హజ్రత్ యహ్యా ల వారి కధనాన్ని వివరిస్తూ ఈ విధంగా పలికారు: ఒక రోజు షైతాను హజ్రత్ యహ్యా[అ.స] ల వారి వద్ద ప్రత్యక్షమయ్యాడు అతని మెడలో విభిన్న రకాలలో కొన్ని తాడులు వెలాడుతున్నాయి.హజ్రత్ యహ్యా[అ.స] ల వారు “ఈ తాడులు ఏమిటి?” అని ప్రశ్నించారు. “ఈ తాడులు మానవుని యొక్క కామవాంచలు మరియు కోరికలు నేను దీని ద్వారా వారిని ఖైదు చేస్తాను” అని అన్నాడు షైతాను. “ఈ తాళ్ళలో ఏదైనా నాకోసం కూడా ఉన్నదా?” అని ప్రశ్నించారు.షైతాను “ఒక్కోసారి అతిగా తినటం మరియు నిద్రించటం వలన మిమ్మల్ని నమాజు మరియు ఆ దేవుని స్మరణ పట్ల నిర్లక్ష్యం వహించేలా చేశాను” అని అన్నాడు. హజ్రత్ యహ్య[అ.స] ల వారు షైతానుతో “ఇప్పటి నుండి నేను ఎప్పుడూ కడుపునిండా భుజించను” అని అన్నారు.అప్పుడు షైతాను హజ్రత్ యహ్య[అ.స] ల వారితో “నేను కూడా ఏ ఒక్క ఆస్తికునికి ఎటువంటి ఉపదేశాన్ని ఇవ్వను” అని అన్నాడు. చివర్లో ఇమాం సాదిఖ్[అ.స] ల వారు హఫస్ తో "ఆ దేవునిపై ప్రమాణం చేసి చెబుతున్నాను జాఫర్ మరియు అతని సంతానంపై ఎప్పుడూ కడుపునిండా భుజించకుండా ఉండటం తప్పనిసరి" అని అన్నారు.
రెఫరెన్స్: సిరాతె సులూక్,హసన్ హసన్ జాదె ఆములి,పేజీ నం:41.
వ్యాఖ్యానించండి