న్యాయాన్ని ఇష్టపడడం, అన్యాయాన్ని ద్వేషించడం మంచిదే కాని న్యాయం కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా వెనకాడని ప్రేమే నిజమైన న్యాయప్రీతం.
కొందరికి సత్యఅసత్యాల మధ్య, న్యాయఅన్యాయల మధ్య తేడా తెలుస్తుంది కాని సత్యం మరియు యదార్థాన్ని సహకరించడంలో వెనకడుగు వేస్తారు. దాని పట్ల నిర్లక్ష్యం చేస్తారు. చరిత్రలో ఇలాంటి విషయాలను సూచించే చాలా సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ ఒక సంఘటనను ప్రదర్శిస్తున్నాము.
అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ మక్కాలో ఉన్నారు. ఇమామ్ హుసైన్[అ.స] మక్కాకు వచ్చారు. అతడు ఇమామ్ కు చూడగానే గట్టిగా కౌగిలించుకొని ఏడ్చాడు. ఆ తరువాత ఇలా అన్నాడు: నేను మీ పితామహులైన దైవప్రవక్త[స.అ]ను ఇలా చేబుతుండగా విన్నాను: “హుసైన్[అ.స] ఫురాత్ ప్రక్కన చంపబడతారు. అతను సహాయం కోసం పిలిచినప్పుడు విని కూడా అతనిని మదత్తు పలకనివారు అల్లాహ్ శిక్షకు అర్హులవుతారు” అప్పుడు ఇమామ్ అతడితో “అయితే నీవు నాకు సహకరిస్తావా?” అని అడిగారు. అతడు “నేను రాలేను” అని అన్నాడు.[తారీఖె దమిష్ఖ్, భాగం14, పేజీ202].
మనిషి కేవలం యదార్థాన్ని చెప్పడంతో కాదు దానిని సహకరించడంతోనే సంపూర్ణత్వాన్ని పొందగలడు.
రిఫ్రెన్స్
సుహైల్ జకార్, తారీఖె దమిష్ఖ్, అల్ తక్వీన్, దమిష్ఖ్, సిరియహ్, 2007.
వ్యాఖ్యానించండి