ముస్లిముల మధ్య ఐక్యత యొక్క ప్రాముఖ్యతను వివరించే మాసూముల కొన్ని హదీసులు.
దైవప్రవక్త[స.అ.వ]: “దైవపాలకులకు కట్టుబడి ఉండి వారి ఆజ్ఞలను పాటించండి ఎందుకంటే ఒక నాయకత్వం పట్ల విధేయత చూపటం ముస్లిం జాతి యొక్క ఐక్యతకు నిదర్శనం” [ఆమాలియె ముఫీద్,1వ భాగం,పేజీ నం:14].
ఇమాం అలి[[అ.స] ల వారు తన ఇద్దరు కుమారులను ఉపదేశిస్తూ ఈ విధంగా ప్రవచించారు: “మీకు ఇతరితో సంబంధాలను ఏర్పరుచుకోవటం మరియు క్షమించే అలవాటు కలిగి ఉండటం అవసరం మరియు విభజనను నివారించటం మరియు ఒకరితో ఒకరు శత్రుత్వాన్ని కలిగి ఉండటం తగదు” [నెహ్జుల్ బలాఘా,లేఖ నం:47].
ఇమాం అలి[అ.స]: “వారి భగవంతుడు ఒక్కడు,వారి ప్రవక్త ఒక్కడు,వారి దైవగ్రంధం ఒక్కటి.వారిని ఆ భగవంతుడు ఒకరినొకరు విభజించుకోమని ఆజ్ఞాపించాడా దానిపై అమలు చేస్తున్నారు?లేదా విభేదించవద్దని ఆపినాడా,వారు అవిధేయతను చూపిస్తున్నారు?” [నెహ్జుల్ బలాఘా,ఖుత్బా నం:18].
ఇమాం సాదిఖ్[అ.స]: “విబేధాలు పుట్టుకొచ్చి దాని వలన ఒక జాతి నాశనమవుతున్న సమయంలో [వాటిని తొలగించి] ఐక్యతను సృష్టించటం మరియు వారు ఒకరికొకరు దూరమవుతున్న సమయంలో వారిని దగ్గర చేయటం ఒక రకమైన ఉపకారము దానిని ఆ భగవంతుడు ఇష్టపడతాడు”[అల్ కాఫి,2వ భాగము,పేజీ నం:209].
వ్యాఖ్యానించండి