అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ మొట్టమొదటి ప్రవక్త అయిన హజ్రత్ ఆదమ్[అ.స] యొక్క కుమారులైన హాబీల్ మరియు ఖాబీల్ సంఘటన ఖుర్ఆన్ ఉల్లేఖన ప్రకారం.
ఖుర్ఆన్ లో అల్లాహ్ హాబీల్ మరియు ఖాబీల్ గురించి ఇలా వివరించెను: “(ఓ మహమ్మద్[స.అ]) ఆదం యొక్క ఇద్దరు కుమారుల వృత్తాంతాన్ని కూడా వారికి యధాతథంగా వినిపించు. వారిరువురూ దైవానికి నజరానా సమర్పించగా, వారిలో ఒకరి నజరానా స్వీకరించబడింది. మరొకరిది స్వీకరించబడలేదు. అప్పుడు రెండవతను(ఖాబీల్), “నేను నిన్ను చంపేస్తాను” అన్నాడు. దానికి సమాధానంగా మొదటివాడు(హాబీల్), “అల్లాహ్ భీతిపరుల నజరానాను మాత్రమే స్వీకరిస్తాడు – నువ్వు నన్ను చంపటానికి చెయ్యి ఎత్తినా, నేను మాత్రం నిన్ను చంపే ఉద్దేశంతో చెయ్యి ఎత్తను. నేను సకల లోకాల ప్రభువైన అల్లాహ్ కు భయపడుతున్నాను. నువ్వు నీ పాపంతో పాటు, నా పాపం కూడా నీ నెత్తిన పెట్టుకుని నరక వాసుల్లో చేరిపోవాలని కోరుకుంటాను (గాని నేను మాత్రం ఆ పాపానికి ఒడిగట్టలేను). దుర్మార్గులకు ప్రతిఫలం ఇదే” అని అన్నాడు. తర్వాత అతని(ఖాబీల్) మనసు తన సోదరుని హత్యకే పురికొల్పింది. అతణ్ణి హత్యచేసి అతడు నష్టపోయిన వారిలో చేరిపోయాడు. ఆ తరువాత సోదరుని శవాన్ని ఎలా దాచాలో అతనికి చూపించటానికి అల్లాహ్ ఒక కాకిని పంపాడు. అది నేలను తవ్వసాగింది. అతను (ఆ దృశ్యాన్ని చూసి) “అయ్యో! నా సోదరుని శవాన్ని దాచే విషయంలో నేను ఈ కాకిపాటు వాణ్ణి కూడా కాలేకపోయానే” అంటూ సిగ్గుతో కుమిలిపోయాడు.[మాయిదహ్:27-31].
వ్యాఖ్యానించండి