అల్లాహ్ మనల్ని గమనిస్తున్నాడు అనే విషయన్ని గుర్తుంచుకున్నట్లయితే నిర్లక్ష్యం మరియు పాపాలకు దూరంగా ఉండవచ్చు.
ఒకరోజు తండ్రి తన కొడుకు దగ్గరికి వచ్చి కొడుకు పుస్తకాలను ధ్యాసతో గమనించడం మొదలుపెట్టాడు. కాసేపు తరువాత కొడుకుతో “నీవు ఎందుకు నీ పుస్తకాలను నీకు తోచినట్టు వ్రాసి పాడుచేయలేదు?” అని ప్రశ్నించాడు దానికి కొడుకు “నేను అలా చేయలేను ఎందుకంటే ఈ పుస్తకాలను నా మాస్టారు చూస్తారు ఆ తరువాతే నాకు మార్కులు ఇస్తారు” అన్నాడు. అది విన్న తండ్రి తన కొడుకుతో “నీ జీవితం కూడా ఈ పుస్తకం యొక్క కాగితాల మాదిరి, అది చెడిపోకుండా ఉండేటట్లు జాగ్రత్త వహించు ఎందుకంటే నీ జీవితాన్ని కూడా నీ భగవంతుడు ప్రతి నిమిషం గమనిస్తున్నాడు, ఒకవేళ నువ్వు నీ జీవితాన్ని చెడుకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా గడిపితే నీకు ప్రతిఫలాన్ని కూడ ఇవ్వనున్నాడు” అన్నాడు.
దివ్యఖురాను ఈ విధంగా ప్రశ్నిస్తుంది: “ఏమిటి, అల్లాహ్ తనను గమనిస్తున్నాడన్న విషయం అతనికి తెలియదా?”[అల్ అలఖ్:14]. నిర్లక్ష్యం కారణంగా మనము కూడా జీవితంలో ఎవరు చూస్తారులే అని ఎన్నో తప్పులకు పాల్పడుతూ ఉంటాము కానీ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవటం మంచిది మనము ఈ లోకంలో అందరిని మోసం చేయగలము ఒక్క భగవంతునిని తప్ప ఎందుకంటే అతను ప్రతీ నిమిషం మనల్ని గమనిస్తునే ఉన్నాడు.
వ్యాఖ్యానించండి