ప్రపంచానికే మార్గదర్శకత్వం వహించడానికి వచ్చిన ఇస్లాం ఉమ్మత్ కు చెందిన వారు ఎందుకు వెనకబడి ఉన్నారు... ఆలోచించండి.
ఈ ఉమ్మత్కు ఏమైపోయింది! ఒకప్పుడు అన్ని మతాలలో ఉత్తమమైనది. తూర్పు మరియు పశ్చిమ వాసులుపై అధికారం మరియు ప్రజల్ని ఏన్నో విద్యలలో, విన్యాసాలలో మరియు సంస్కృతిని పరిచయించిన తరువాత దాని ఉత్తమము తగ్గిపోయి అల్పమైయ్యింది. దాని భూములు ఆక్రమించబడ్డాయి. కుటుంబాలు, వంశాలు దిక్కులేనివారైయ్యారు. వాళ్ళ మస్జిదుల్ అఖ్సాను యూదుల ఆక్రమించేశారు. వాళ్ళకు దాన్ని విడిపించుకునే శక్తి లేదు. ఆ దేశాలను చూస్తే దారిద్ర్యం, ప్రాణాంతకమైన ఆకలి, బీడు నేల, పీడ రోగాలు మరియు దుర్వర్తనము తప్ప ఏది కనబడదు. ఆలోచన పరంగా వెనకబడి ఉండటం, అన్యాయం దౌర్జన్యం మరియు పిపీలకాదులే ఇస్లామీయ దేశాల గుర్తింపు. ఉదాహారణకి మరుగు దొడ్లనే తీసుకోండి తూర్పు వాసుల టాయ్లేట్లు ఎలా వుంటాయీ?, మరి మన టాయ్లేట్లు ఎలా వుంటాయి?. ఒక ప్రయాణికుడు అక్కడి టాయ్లేట్లో వెళ్ళినప్పుడు అన్నీంటిని శుభ్రంగా అద్దం వలే మెరుస్తూ మంచి సువాసనను చూస్తాడు కాని అదే మా దేశాల టాయ్లేట్లలో మురికి దుర్వాసన, వాటి వల్ల ప్రయాణికుడు దాని లోపల కాలు పెట్టడానికి కూడా దైర్యం చేయలేడు. నిజంచెప్పాలంటే “ఇస్లాం మమ్మల్ని పరిశుభ్రత ఈమాను యొక్క భాగం అని మరియు అపవిత్రత షైతాను భాగం” అని నేర్పుతుంది. అంటే ఈమాన్ ఇక్కడ నుండి అక్కడికి మారిందా, ఇక్కడ కేవలం షైతాను రాజ్యమే మిగిలిందా!?....
ఆలోచించండి...
వ్యాఖ్యానించండి