జమల్ యుద్ధంలో ఎవరి సైన్యం వారు మార్గభ్రష్టులు అన్న విషయం పై సంక్షిప్త వివరణ..
జమల్ యుద్ధంలో పాల్లొన్న ఇరువైపు సైన్యాలు ముస్లిం సైన్యాలే. వారిలో ఒక సైన్యం మాత్రమే రుజుమార్గం పై ఉన్నారు, మరో సైన్యం రుజుమార్గం పై లేరు అన్న విషయం అందరికి తెలిసిందే. మరి వారిలో ఎవరు రుజుమార్గంపై ఉన్నారు మరి ఎవరు రుజుమార్గం పై లేరు?; ఉంటే అలీ[అ.స] మరియు అతని అనుచరులు రుజుమార్గంపై లేరూ లేదా ఉమ్ముల్ మొమినీన్ ఆయెషా మరియు ఆమె అనుచరులు తల్హా, జుబైర్లు రుజుమార్గంపై లేరు.
హదీసు గ్రంథాలు చదివే బుద్ధిమంతులు ఇట్టే ఈ సమస్యను పరిక్షరించగలరు; ఎందుకంటే దైవప్రవక్త[స.అ] ప్రవచనానుసారం “ఎల్లప్పుడూ అలీ[అ.స]తో పాటు సత్యం మరియు సత్యం అలీ[అ.స]తో పాటు ఉంటారు, ఇంతకు మించి చెప్పాలంటే సత్యం అతని చుట్టూ తిరుగుతూ ఉంటుంది”. అంటే హజ్రత్ అలీ[అ.స] ఎటు ఉంటే ఆ సైన్యం రుజుమార్గం పై ఉన్నట్లు వారి ఎదురుగా ఉన్న సైన్యం వారు మార్గభ్రష్టులు.
వ్యాఖ్యానించండి