కొన్ని క్లిష్ట సమయాలలో ఇమాం అలి[అ.స] ల వారు తీసుకున్న నిర్ణయాలు ప్రశంసనీయం మరియు అవి ముస్లిముల ఐక్యత కొరకు ఇమాం ల వారి కృషిని వివరిస్తాయి.
దైవప్రవక్త[స.అ.వ] ల వారి తరువాత పవిత్ర ఇమాముల తీరు మరియు ముస్లిముల ఐక్యత కొరకు వారు చేసిన కృషి ఐక్యమత్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది.ముఖ్యంగా ఇమాం అలి[అ.స] ల వారు కష్ట సమయాలలో ముస్లిములు వర్గాలుగా చీలిపోకుండా ఉండటానికి ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలాంటి సందర్భాలలో జమల్ యుధ్ధం కూడా ఒకటి.జమల్ యుధ్ధ సమయంలో కొంత మంది నాయకులు కుట్రకు పాల్పడినప్పుడు ఇమాం ల వారు బస్రా వైపు పయనమయ్యారు ఆ సమయంలో ఈ విధంగా ఉల్లెఖించటం జరిగింది: “నేను చూస్తున్నాను ఇచట సహనాన్ని పాటించటం ముస్లిముల విభజన మరియు వారి రక్తాన్ని చిందించే కన్నా ఉత్తమము.ఇప్పుడే ముస్లిములైన ప్రజల యొక్క ఉపమానం నీటితో నిండి ఉన్న ఒక కూజా లాంటిది ఏమాత్రం కొద్దిగా కదిపినా లేదా ఏ ఒక్క వ్యక్తి దానిని తలక్రిందులుగా చేసినా నీరు నేలపాలవుతుంది [అదే విధంగా తాజాగా ఇస్లామును స్వీకరించిన ముస్లిములు కూడా విబేధాల వలన ఇస్లాము నుండి దూరము కావచ్చునని ఇమాం ల వారి ఉద్దేశం], తల్ హా మరియు జుబైర్ ఈ నిప్పును రగల్చే పని చేయక పోతే ఎంత బాగుండేదో”.
రెఫరెన్స్: షర్హె నెహ్జుల్ బలాఘా,ఇబ్నె అబిల్ హదీద్,1 వ భాగం,పేజీ నం:308.
వ్యాఖ్యానించండి