హజ్రత్ ఆయిషా గురించి సహీబుఖారీ గ్రంథంలో రివాయతుల వివరణ...
“బుఖారీ” తన “సహీ” గ్రంథంలో “కితాబుల్ ఫితన్” అను అధ్యాయంలో ఈ రివాయత్ను ప్రవచించారు: తల్హా, జుబైర్ మరియు ఆయెషా బస్రా వైపు వెళ్తుండగా అలీ[అ.స] తమ కుమారుడు హసన్[అ.స] మరియు అమ్మారె యాసిర్లను కూఫాకు పంపారు. వాళ్ళు కూఫా వచ్చి జనాన్ని పోగు చేసి పీఠంపై ఎక్కారు. హసన్[అ.స] ఆఖరి మెట్టుపై మరియు దాని క్రింద మెట్టుపై అమ్మర్ ఎక్కి నిలబడ్డారు. అమ్మార్ బిగ్గరగా “ఆయెషా బస్రా వైపు వెళ్తున్నారు ఆమె మీ దైవప్రవక్త[స.అ] భార్య” అని ప్రకటించి. “ఇప్పుడు మీరు దైవప్రవక్త[స.అ] విధేయుతులా? లేక ఆయెషా విధేయుతులా? అని అల్లాహ్ మిమ్మల్ని పరిక్షిస్తున్నాడు” అని అన్నారు.[సహీ బుఖారీ, భాగం4, పేజీ 161]
అలాగే “కితాబుల్ మష్రూత్”లో భార్యల గురించి ఇలా ప్రస్తావిస్తున్నారు: “దైవప్రవక్త[స.అ] ఉపన్యాసమిస్తూ ఆయేషా ఇంటి వైపు సైగ చేస్తూ ఆపద ఇక్కడే ఉంది, ఆపద ఇక్కడే ఉంది, ఉంద ఇక్కడే వుంది అది షైతాను కొమ్ములు మెలిసినట్లే బయటకు వస్తుంది” అని అన్నారు.
రిఫ్రెన్స్
బుఖారీ, సహీ బుఖారీ, భాగం4, పేజీ 161.
వ్యాఖ్యానించండి