ఒక పెద్ద వివాదాన్ని పరిష్కరించిన దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఒక చిన్న ఉపదేశము.
ఒక రోజు ఒక వ్యక్తి దైవప్రవక్త[స.అ.వ] ల వారి వద్దకు వచ్చి నాకు బోధన చేయండి మరియు మతం యొక్క ఆచారాలను తెలియపరచమని కోరాడు.దానికి దైవప్రవక్త[స.అ.వ] ల వారు “వెళ్ళు ఎప్పుడూ కోపగించుకోకు” అని చెప్పారు.అప్పుడు ఆ వ్యక్తి “ఈ వాక్యం నాకు చాలు” అని చెప్పి తన సమూహము వైపునకు తిరిగి వెళ్ళిపోయాడు.అక్కడకు చేరుకున్న ఆ వ్యక్తి తన వర్గానికి మరియు వేరొక వర్గానికి మధ్య వివాదం తలెత్తటం చూసాడు.అందరూ తమ చేతిలో ఆయుధాలను తీసుకుని ఒకరికొకరు వ్యతిరేకంగా యుద్ధానికి సన్నధ్ధమవ్వటం చూసాడు.తాను కూడా యుద్ధానికి సన్నధ్ధమై తన సమూహం వైపు వెళ్ళసాగాడు.ఒక్క సారిగా ఎట్టిపరిస్థితులలో కూడా కోపగించుకోవద్దని దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఉపదేశం గుర్తుకువచ్చి ఆగిపోయాడు.తన ఆయుధాన్ని క్రింద పడేసి తమ శత్రువుల వద్దకు వెళ్ళి “యుద్ధం మరియు రక్తాన్ని చింధించటం వలన ఎటువంటి ఉపయోగము లేదు,నేను నా సొమ్ము నుండి మీకు ఎంత కావాలన్నా ఆ మొత్తాన్ని చెల్లిస్తాను” అని చెప్పాడు.మిక్కిలి వినయంతో విషయాన్ని అర్ధం చేసుకున్న ఇతర సమూహం వాళ్ళు “ఇట్టిపరిస్థితులలో క్షమించి వదిలి వేయటమే ఉచితము” అని చెప్పి వెళ్ళిపోయారు.ఈ విధంగా దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఒక ఉపదేశం పెద్ద వివాదాన్ని పరిష్కరించినట్లైంది.
రెఫరెన్స్: అలి అక్బర్ సదాఖత్,ఎక్ సద్ మౌజూ పాన్సద్ దాస్తాన్,పేజీ నం:391.
వ్యాఖ్యానించండి