మనిషి వినాశానికి కారణమయ్యే రెండు అలవాట్లు ఇమాం సాదిఖ్[అ.స] ల వారి నోట.
ముఫజ్జల్ ఈ విధంగా పలికెను: ఇమాం సాదిఖ్[అ.స] ల వారు నాతో ఈ విధంగా సెలవిచ్చారు: “నేను నిన్ను రెండు రకాల అలవాట్ల నుండి ఆపుతున్నాను వాటిలో ప్రజల యొక్క వినాశమున్నది: నిన్ను తప్పుడు మార్గాన్ని వదిలి అల్లాహ్ సున్నత్ ను అనుసరించమని పిలుస్తున్నాను మరియు జ్ఞానం లేకుండా ప్రజలకు ఫత్వాలు ఇవ్వవద్దని వారిస్తున్నాను”.ఈ హదీసులో ఇమాం ల వారు రెండు పనుల నుండి వారిస్తున్నారు.ఒకటి తప్పుడు దారిని వీడి అల్లాహ్ మార్గం వైపుకు రావాలని చెబుతున్నారు.మనిషి నిరంతరం మార్పు అనే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాడు.ఈ లోకంలో ప్రతీ వస్తువులో మార్పులు సంభవిస్తాయి.తనలో మార్పులు చూడని వ్యక్తి ఒక రాయి తో సమానం.ఏ విధంగా అయితే ఒక విత్తనము మొక్కయ్యి ఆ తరువాత చెట్టయ్యి పూలు పండ్లు ఇస్తుందో అదే విధంగా మనిషి కూడా తన జీవిత పరమార్ధాన్ని గ్రహించి,అవివేకాన్ని,అసత్యాన్ని,ద్వేషాన్ని,ఈర్ష్యను వదిలి ఆ దేవుని మార్గము వైపు పయనించాలి. ఇమాం ల వారు వారించిన రెండవ పని జ్ఞానము లేకుండా ఫత్వాలివ్వటం.ఇది దారి తెలియని వాడు ఇతరులకు దారిని చూపటం లాంటిది.ఇలా చెయటం అతనికే కాదు మొత్తం సమాజానికి హానికరం.
రెఫరెన్స్: ఉసూలె కాఫి,కితాబె ఫజ్లె ఇల్మ్,హదీసు నం:95.
వ్యాఖ్యానించండి