భగవంతుడు మానవులలో సమానత్వాన్ని నెలకొల్పాలని మరియు ధనికులకు ఆకలి కష్టాలను తెలియజేయాలని తద్వారా వారు పేద,బలహీన ప్రజలపై దయచూపాలని ఉపవాసాన్ని విధిగా చేయటం జరిగింది.
దైవప్రవక్త[స.అ.వ] ల పవిత్ర రమజాన్ యొక్క విశేషత్వాన్ని ప్రస్థావిస్తూ “రమజాన్ సానుభూతి యొక్క నెల” అని సెలవిచ్చారు.సానుభూతి అంటే ఒకరి నొకరు ఆదుకోవటం మరియు ఆర్ధికంగా సహాయపడటం.పవిత్ర రమజాన్ మాసము అణగారిన వారు,ఆకలితో ఉన్నవారు,అభాగ్యులు,దురదృష్టవంతులు మరియు పేదవారి పట్ల సానుభూతిని చూపే మాసము. ఉపవాసముండటానికి కారణమేంటి అన్నదానికి హదీసులలో చాలా రకమైన కారణాలు ప్రస్థావించబడ్డాయి.హష్షాం ఇబ్నె హకం ఇమాం సాదిఖ్[అ.స] ల వారితో ఉపవాసముండటానికి కారణమేమిటి?అని ప్రశ్నించారు.దానికి ఇమాం సాదిఖ్[అ.స] ల వారు ఆ భగవంతుడు ధనికుడు మరియు పేదవాడు సమానంగా ఉండటానికి ఉపవాసాన్ని విధిగా చేసాడు.ఎందుకంటే ధనికుడు ఎప్పటి వరకైతే ఆకలిదప్పులను తెలుసుకోడో పేదవాడిపై కనికరించడు. ఎందుకంటే అతను ఏ విధంగా సహాయం చేద్దామన్నా ఆ స్థొమత అతని వద్ద ఉంది.అందువలనే భగవంతుడు మానవులలో సమానత్వాన్ని నెలకొల్పాలని మరియు ధనికులకు ఆకలి కష్టాలను తెలియజేయాలని తద్వారా వారు పేద,బలహీన ప్రజలపై దయచూపాలని ఉపవాసాన్ని విధిగా చేయటం జరిగింది.
రెఫరెన్స్: మన్లా యహ్జరుహుల్ ఫఖీహ్,2వ భాగం,పేజీ నం:73.
వ్యాఖ్యానించండి