ఎప్పుడైతే మానవుడు ప్రమాదంలో ఉన్నప్పుడు కాకుండా తనకు తాను స్వేచ్చతో ఆ దేవుని సమక్షంలో ప్రాయశ్చితాన్ని కోరుకుంటాడో అప్పుడే ఆ భగవంతుని వద్ద అతని ప్రాయశ్చితానికి విలువ ఉంటుంది.
దివ్యఖురానులో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు: నిరంతరం పాపకార్యాలకు పాల్పడుతూ,తీరా మరణ ఘడియలు సమీపించాక "ఇప్పుడు నేను పశ్చత్తాప పడుతున్నాను" అని అనే వారి పశ్చాత్తాపం ఆమోదించబడదు.అలాగే అవిశ్వాస స్థితిలో ప్రాణం విడిచే వారి పశ్చాత్తాపం కూడా స్వీకరించబడదు.ఇలాంటి వారి కోసమే మేము వ్యధా భరితమైన శిక్షను సిధ్ధం చేసి ఉన్నాము [అన్ నిసా/18]. పశ్చాత్తాపానికి ఆలస్యం పనికిరాదు.ఎందుకంటే మృత్యువు ఎప్పుడు వస్తుందో తెలియదు.మృత్యువు సమయంలో ప్రాయశ్చిత పడినా ఏమీ లాభముండదు.ఎప్పుడైతే మానవుడు ప్రమాదంలో ఉన్నప్పుడు కాకుండా తనకు తాను స్వేచ్చతో ఆ దేవుని సమక్షంలో ప్రాయశ్చితాన్ని కోరుకుంటాడో అప్పుడే ఆ భగవంతుని వద్ద అతని ప్రాయశ్చితానికి విలువ ఉంటుంది.మృత్యువును చూసిన తరువాత అవిశ్వాసునికి కూడా ఆ భగవంతునిపై విశ్వాసము పుట్టుకొస్తుంది,అప్పుడు అతడు ఆ భగవంతునిని ఒక్క అవకాసమివ్వమని ప్రాధేయపడతాడు.అందువలనే మృత్యుదూత కనిపించే ముందే ఆ దేవుని సమక్షంలో ప్రాయశ్చితం పొందితేనే,మానవుని ప్రాయశ్చితానికి విలువ ఉంటుంది.
వ్యాఖ్యానించండి