అసత్యవాదుల మరియు వారి అనుచరుల వల్ల పవిత్ర ఇమాములందరూ[అ.స] మౌనంగా ఉండి ఇస్లాం మరియు ముస్లిముల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు...
దైవప్రవక్త[స.అ] 12వ ఉత్తరాధికారి అయిన అంతిమ ఇమామ్, అసత్యుల అధిక సంఖ్య వల్ల, సత్య సహచరులు పొందేంత వరకు అదృశమయ్యారు. అప్పుడు అల్లాహ్ అతనికి ప్రపంచవ్యాప్తంగా అసత్యం పై సత్యద్వజాన్ని ఎత్తేందుకు ప్రత్యేక్షమయ్యే ఆజ్ఞను ఇస్తాడు. ఇమామ్ మహ్దీ[అ.స] అంతకు ముందు అన్యాయం మరియు దుర్మార్గంతో నిండి ఉన్న భూమిని న్యాయధర్మాలతో నింపేస్తారు. వేరే విధంగా చెప్పాలంటే ఇంతకు ముందు అన్యాయం మరియు దుర్మార్గంలో మునిగి ఉన్న నేలను న్యాయధర్మాలతో నింపేస్తారు.
అప్పుడు కూడా సత్యాన్ని ఇష్టడనివారు చాలా మంది ఉంటారు. వాళ్ళు అసత్యవాదులై ఉంటారు. సత్యాన్ని ఇష్టపడేవారు చాలా తక్కువగా ఉంటారు. కాని ఆ తక్కువ మందే అల్లాహ్ అద్భుతమైన సహాయంతో అసత్యంపై విజయం సాదిస్తారు. దీనికి నదర్శనం ఖుర్ఆన్ యొక్క బఖరహ్ సూరహ్ యొక్క 249వ ఆయత్ నిదర్శనం.
వ్యాఖ్యానించండి